Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ తో 'మంగళవారం' డైరెక్టర్.. సూపర్ కాంబో!!

ఆర్ ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి.. డెబ్యూతో ఎలాంటి హిట్ అందుకున్నారో తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Sep 2024 4:05 PM GMT
స్టార్ కిడ్ తో మంగళవారం డైరెక్టర్.. సూపర్ కాంబో!!
X

ఆర్ ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి.. డెబ్యూతో ఎలాంటి హిట్ అందుకున్నారో తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఆ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. భారీ వసూళ్లను సాధించారు. అదే జోష్ తో తన సెకెండ్ సినిమా మహా సముద్రం చేశారు. కానీ అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు. మంచి మార్కులు మాత్రం దక్కించుకున్నారు. రీసెంట్ గా మంగళవారం సినిమాతో మళ్లీ మంచి హిట్ సాధించారు.

ఆ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ నే హీరోయిన్ గా నటించగా.. మూవీకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు అందుకుంది. ఆస్కార్ పరిశీలన లిస్ట్‌ లోకి కూడా ఆ సినిమా వెళ్లిందని రీసెంట్ గా తెలియడంతో అజయ్ భూపతి టాలెంట్ పట్ల అంతా ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. ఓ స్టార్ హీరో కుమారుడితో అజయ్ భూపతి తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు టాక్.

వాస్తవానికి అజయ్ భూపతి మంగళవారం-2 చేస్తారని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీస్తారని కూడా టాక్ వినిపించింది. కానీ అంతకుముందే.. ఆయన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌ తో ఓ సినిమా చేస్తారని ఇప్పుడు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ధృవ్ తో పాటు విక్రమ్ కు అజయ్ భూపతి.. రీసెంట్ గా కలిసి స్టోరీ నెరేట్ చేశారని తెలుస్తోంది.

కథ నచ్చి వెంటనే వారు ఓకే చెప్పడంతో.. స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్నారట అజయ్ భూపతి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్, పవర్ ఫుల్ యాక్టర్ కాంబో‌లో ఎలాంటి సినిమా రానుందో అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అజయ్.. ఎలాంటి కథతో రానున్నారోనని మాట్లాడుకుంటున్నారు. త్వరలో పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి కోలీవుడ్ రీమేక్ ఆదిత్య వర్మ మూవీతో ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత తండ్రి విక్రమ్ తో కలిసి మహాన్ సినిమాలో యాక్ట్ చేశారు. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న బిసోన్ లో నటిస్తున్నారు. ఇప్పుడు అజయ్ భూపతితో వర్క్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ధృవ్ విక్రమ్, అజయ్ భూపతి ప్రాజెక్టు అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.