Begin typing your search above and press return to search.

అఖండ 2 పవర్‌ఫుల్ డైలాగ్ లీక్

ఫలితంగా బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 11:12 AM GMT
అఖండ 2 పవర్‌ఫుల్ డైలాగ్ లీక్
X

‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో వచ్చి హ్యాట్రిక్ విజయాలను అందుకుని ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతున్నారు సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో ఆయన ఫాలోయింగ్ మరింత పెరగడంతో పాటు మార్కెట్ కూడా మరింతగా విస్తృతం అయింది. ఫలితంగా బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్నారు.

ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ బీభత్సమైన ఫామ్‌తో సత్తా చాటుతోన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే తన 110వ సినిమాను కూడా ప్రకటించారు. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం గతంలో హిట్ అయిన ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తుంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే ఈ సినిమాకు ‘అఖండ 2’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. దీనికి ‘తాండవం’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ విషయాన్ని తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో రివీల్ చేశారు. అంతేకాదు, ఇందులో బాలయ్యపై ముహూర్తపు సన్నివేశాన్ని కూడా షూట్ చేశారు. దీనికి ఆయన పెద్ద కుమార్తె బ్రహ్మణి నారా క్లాప్ కొట్టగా.. చిన్న కూతురు తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

‘అఖండ 2’ పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశం సందర్భంగా నందమూరి బాలకృష్ణ ‘గుంపులు గుంపులుగా ఊరు మీద పడితే ఊరుకోవడానికి ఈ నెల అసురుడిది కాదురా.. ఈశ్వరుడుడి పరమేశ్వరుడిది. కాదు అని తాకితే జరిగేది తాండవం.. అఖండ తాండవం’ అనే డైలాగ్‌ను చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫలితంగా ఇది వైరల్‌గా మారిపోయింది.

వాస్తవానికి బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీళ్ల కలయికలో వచ్చిన చిత్రాలన్నీ హిట్లుగా నిలిచాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా కొత్త సినిమాకు సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికే గూస్‌బమ్స్ తెప్పించే డైలాగును చెప్పి బాలయ్య ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెంచేశారని చెప్పుకోవచ్చు.

సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఫస్ట్ పార్టులో కనిపించిన చాలా మంది ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నందమూరి తేజస్విని సమర్పణలో రాబోతుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడలోనూ విడుదల కానుంది.