Begin typing your search above and press return to search.

మరో దర్శకుడికి అఖిల్ గ్రీన్ సిగ్నల్.. ముందు ఏది?

యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చాలా కాలంగా టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Oct 2024 4:31 AM GMT
మరో దర్శకుడికి అఖిల్ గ్రీన్ సిగ్నల్.. ముందు ఏది?
X

అక్కినేని యువ హీరో అఖిల్ చివరిగా ‘ఏజెంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత మరల ఇప్పటి వరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. అఖిల్ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ సారి సూపర్ హిట్ కొట్టాలనే కసితో అఖిల్ ఉన్నారు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా టైం తీసుకుంటున్నాడు. యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చాలా కాలంగా టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరిగింది. దానికోసం అఖిల్ తన లుక్ కంప్లీట్ గా చేంజ్ చేశాడు. ఫుల్ గా గెడ్డం, లాంగ్ హెయిర్ తో చాలా కాలంగా కనిపిస్తున్నాడు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ని ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇదిలా ఉంటే అఖిల్ తన హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మురళీ కిషోర్ తో ఈ మూవీ ఉంటుందనే టాక్ నడుస్తోంది. నాగార్జున, సుప్రియ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని అంటున్నారు. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ ఉంటుందంట.

అయితే ఈ సినిమాపైనే కూడా ఇంకా ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఈ రెండింటిలో అఖిల్ ఏది ఫస్ట్ స్టార్ట్ చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. మరో వైపు అఖిల్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఓ వెబ్ సిరీస్ కి ఒకే చెప్పాడనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ మూడు ప్రాజెక్ట్స్ లలో ఏది ముందు ఉంటుంది, నిజంగా ఉన్నాయా లేదా అనే విషయాలపై ఎలాంటి స్పష్టత రావాల్సి ఉంది.

అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ నుంచి ఈ సారి సాలిడ్ హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. నాగ చైతన్య తండేల్ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నాగార్జున కూడా కుభేరతో పాటు కూలీ సినిమాలలో నటిస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే తెరకెక్కుతున్నాయి. మరి అఖిల్ ప్లాన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.