Begin typing your search above and press return to search.

ఎన్ కన్వెన్షన్ ఇష్యూ.. నాగ్ అన్నయ్య ఏమన్నారంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ ను తెలంగాణ ప్రభుత్వ సంస్థ హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 11:35 AM GMT
ఎన్ కన్వెన్షన్ ఇష్యూ.. నాగ్ అన్నయ్య ఏమన్నారంటే?
X

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ ను తెలంగాణ ప్రభుత్వ సంస్థ హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని మాదాపూర్‌ లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ కూల్చివేత ను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూల్చివేసినట్లు తెలిపారు. అయితే కన్వెన్షన్‌ కూల్చివేతపై నాగార్జున ఆరోజే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణను కోరారు.

దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టి.. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానీ స్టే ఆర్డర్ వచ్చే సమయానికి నిర్మాణాన్ని కూల్చివేశారు హైడ్రా అధికారులు. అయితే అది పట్టా భూమి.. చట్ట విరుద్ధమైతే తాను కూల్చేవాడినని సోషల్ మీడియాలో నాగ్ తెలిపారు. ఆ తర్వాత కోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉన్నానని, అప్పటి వరకు ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని మరో ట్వీట్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు.

ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు తన ఆస్తి కూల్చివేత విషయంపై నాగ్ స్పందించలేదు. మీడియాతో కూడా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో మాత్రమే రెండు ట్వీట్లు చేశారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారం, నాగార్జున ప్రవర్తించిన విధానంపై ఆయన అన్నయ్య అక్కినేని వెంకట్ స్పందించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. నాగ్ వ్యక్తిత్వమంటే అది అని అక్కినేని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు

"నాగార్జునకు సంబంధించి ఇటీవల జరిగిన కాంట్రవర్సీ గురించి అందరికీ తెలిసిందే. అదే ఎన్ కన్వెన్షన్ ల్యాండ్ కాంట్రవర్సీ. చాలా మంది ఏదో అనుకుంటారు. కానీ అతడు స్టైయిట్ గా వెళ్తాడు. న్యాయపరంగా పోరాడుతున్నాడు. ఏ విషయంలోనైనా డిస్ట్రబ్ అయిపోయి.. బ్యాడ్ గా రియాక్ట్ అయిపోయి.. పానిక్ అయిపోయి.. ధర్నా చేసి.. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. అలా ఏం చేయడు. కామ్ గా ఉన్నాడు. జస్ట్ ట్విట్టర్ మెసేజ్ లు పెట్టాడు అంతే. అక్కడితో వదిలేశాడు" అని వెంకట్ తెలిపారు.

"అది చాలా మంచి పని. అందరికీ లైఫ్ లో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంటుంది. జీవితంలో ఇష్టం ఉన్నది జరిగితే పర్లేదు.. కానీ ఇష్టం లేనివి కూడా జరుగుతుంటాయి. దానికి తోడు సెలబ్రిటీలు.. కాబట్టి పది రెట్ల ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎంతో మంది విషయంలో అలా జరిగినా.. అతడి విషయం ఫోకస్ అయింది. ముఖ్యంగా అతడు ఎంటర్ అయితే కాంట్రవర్సీ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే సంయమనంతో ఉన్నాడు" అని నాగ్ బ్రదర్ అక్కినేని వెంకట్ తెలిపారు.