Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోని మోసం చేసిన నిర్మాతలు..!

ఆయన ఖాతాలో సర్ఫిరా మరో ఫ్లాప్ గా నిలువబోతుందని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   25 July 2024 4:30 PM GMT
స్టార్‌ హీరోని మోసం చేసిన నిర్మాతలు..!
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సక్సెస్‌, ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దండ యాత్ర చేస్తున్నాడు. తాజాగా తమిళ హిట్ మూవీ సూరారై పోట్రు రీమేక్ 'సర్ఫిరా' చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. ఆయన ఖాతాలో సర్ఫిరా మరో ఫ్లాప్ గా నిలువబోతుందని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.


సర్ఫిరా ఫలితం విషయం పక్కన పెడితే ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా పలు మీడియా సంస్థలకు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూల్లో భాగంగా తాను బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేయడం పట్ల స్పందించాడు, అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వరుసగా ఎదురు అవుతున్న ఫ్లాప్స్ పై కూడా స్పందించాడు.

అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.... వ్యక్తిగత జీవితంలో ఎలా అయితే మనను మోసం చేసే వాళ్లు ఉంటారో, అలాగే వృత్తి పరంగా కూడా మోసం చేసే వారు ఉంటారు. నేను కూడా పలు సార్లు మోస పోయాను. నన్ను చాలా మంది నిర్మాతలు నాకు ఇవ్వాల్సిన మొత్తాలను ఇవ్వకుండా మోసం చేశారు.

ఇండస్ట్రీకి చెందిన వారు నన్ను మోసం చేశారు, వారిని నేను దూరం పెట్టాను. ఇప్పటికి నేను వారితో మాట్లాడటం లేదు. ఇప్పటికి కూడా చాలా మంది నిర్మాతలు నాకు బాకీ ఉన్నారు. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా నన్ను మోసం చేసిన నిర్మాతలను నేను ఇక ముందు ఎప్పుడు కూడా నమ్మను అన్నాడు.

ఇక సినిమాలను బ్యాక్ టు బ్యాక్ చేయడం అనేది నాకు నేను సమర్థించుకుంటాను. కొందరు అన్నట్లుగా నేను ఏడాదికి ఒకే ఒక్క సినిమా చేస్తే మిగిలిన సమయం మొత్తం ఏం చేయాలి. నేను సమయం వృధా చేయాలని అనుకోవడం లేదు. నేను ఒప్పుకున్న సినిమాకు పూర్తి న్యాయం చేసేందుకు నా వంతు కృషి చేస్తాను అన్నాడు.

నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టి 33 నుంచి 34 ఏళ్లు అవుతుంది. ఇన్నాళ్ల కెరీర్‌ లో నేను ఎప్పుడు కూడా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం, ఇతరుల ఓటముల గురించి కోరుకోవడం చేయలేదు. కానీ నా ఓటములు కొందరు ఆస్వాదిస్తున్నారు. కొందరు నా ఓటములను కోరుకుంటున్నారు అంటూ అక్షయ్‌ కుమార్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. మరి వారు ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.