Begin typing your search above and press return to search.

గ‌తంలోనూ క‌ల‌వ‌లేదు..ఇప్పుడు ఎవ‌రూ లేరు!

నంద‌మూరి తార‌క‌ర‌త్న హ‌ఠాన్మ‌ర‌ణం తెలుగు ప్రేక్ష‌కుల్ని అంద‌ర్ని ఎంత‌గా క‌ల‌చి వేసిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Aug 2024 6:37 AM GMT
గ‌తంలోనూ క‌ల‌వ‌లేదు..ఇప్పుడు ఎవ‌రూ లేరు!
X

నంద‌మూరి తార‌క‌ర‌త్న హ‌ఠాన్మ‌ర‌ణం తెలుగు ప్రేక్ష‌కుల్ని అంద‌ర్ని ఎంత‌గా క‌ల‌చి వేసిందో తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణాన్ని ప్రేక్ష‌కాభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఓ మంచి మ‌నిషిని కోల్పోయామ‌నే భావ‌న వెంటాడుతూనే ఉంది. ఇక తార‌క‌ర‌త్న వ్య‌క్తిగ‌త జీవితంలోనూ కొన్ని స‌వాళ్లు ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. అలేఖ్య‌రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాటి నుంచి కుటుంబానికి దూరంగానే ఉన్నాడు.

అలాగ‌ని మాట‌లు లేనంత దూరం పెర‌గ‌లేదు. త‌న‌వ‌ర‌కూ కుటుంబంతో స‌త్స‌సంబంధాన్ని కొన‌సా గించాడు. కాలం గడిచే కొద్ది ఆ కుటుంబంతో బాండింగ్ బ‌ల‌ప‌డుతోన్న స‌మ‌యంలోనే హాఠాన్మ‌ర‌ణం ఆ బంధాన్ని వేరు చేసింది. అయితే తార‌క‌ర‌త్న మ‌ర‌ణించిన త‌ర్వాత నంద‌మూరి కుటుంబం అలేఖ్య రెడ్డికి ద‌గ్గ‌రయిందా? అంటే లేద‌నే తెలుస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటి జ‌నులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అలేఖ్య స్పందించారు.

ఈ క్ర‌మంలోనే ఓ నెటి జ‌నుడు తార‌క‌ర‌త్న ఫ్యామిలీ..మిమ్మ‌ల్ని ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారా? అని అడిగాడు. దానికి అలేఖ్య రెడ్డి ఇలా స్పందించారు. `గ‌తంలోనూ లేదు..ఇప్పుడు లేదు` అన్నారు. అలాగే నారా లోకేష్ మాత్రం అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా స‌హాయం చేస్తున్నార‌న్నారు. ష‌ర్మిల‌తో మాత్రం మంచి బాండింగ్ ఉంద‌న్నారు. త‌మ ఇద్ద‌రిని దేవుడు క‌లిపాడ‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు.

తార‌క‌ర‌త్న నారాలోకేష్ `యువ‌గ‌ళం` పాద‌యాత్ర స‌మ‌యంలో గుండె పోటుకు గురైన సంగ‌తి తెలిసిందే. ఆసుప‌త్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకుంటూ క‌న్ను మూసారు. తార‌క‌ర‌త్న‌-అలేఖ్య రెడ్డికి ఇద్ద‌రు కుమార్తెలు- ఒక బాబు క‌ల‌రు. అలేఖ్య రెడ్డి ..విజ‌య‌సాయి రెడ్డికి ద‌గ్గ‌ర బంధువు అవుతారు.