Begin typing your search above and press return to search.

ప్రతి ఒక్కరికి అప్పుడే ధైర్యం వస్తుంది...!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్‌ ప్రస్తుతం వాసన్ బాలా దర్శకత్వంలో 'జిగ్రా' అనే సినిమాలో నటిస్తుంది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:41 AM GMT
ప్రతి ఒక్కరికి అప్పుడే ధైర్యం వస్తుంది...!
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్‌ ప్రస్తుతం వాసన్ బాలా దర్శకత్వంలో 'జిగ్రా' అనే సినిమాలో నటిస్తుంది. లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రను వేదాంత్ రైనా పోషిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

జిగ్రా ను మొదట సెప్టెంబర్‌ 27న విడుదల చేయాలని భావించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ తాజాగా ఆ తేదీకి రావడం లేదు అంటూ మేకర్స్ పేర్కొన్నారు. జిగ్రా ను అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఆలియా భట్ పేర్కొంది.

కొత్త విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ ను ఆలియా భట్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ పోస్టర్ తో పాటు మనకు దగ్గరైన వాళ్లు ప్రమాదంలో ఉన్నప్పుడు కచ్చితంగా మనకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం తో మనం వారిని కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తాం అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది.

బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రమాదంలో ఉన్న ఒక అక్క కోసం అమాయకుడు అయిన తమ్ముడు చేసే పోరాటాలను చూపించబోతున్నారు. ఆలియా భట్‌ కోసం ఈ సినిమాలో వేదాంత్‌ రైనా తమ్ముడి పాత్ర లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్‌ లో ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో నటించిన ఆలియా భట్‌ మళ్లీ తెలుగు లో ఎప్పుడెప్పుడు నటిస్తుందా అంటూ ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి హిందీ మరియు ఇంగ్లీష్ సినిమాలపైనే ఈ అమ్మడు దృష్టి పెట్టినట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు.