Begin typing your search above and press return to search.

మెగా vs అల్లు ఫైట్ పీక్స్.. పవన్ రిపేర్!

టాలీవుడ్ కు చెందిన మెగా, అల్లు కుటుంబాల మధ్య ఏం జరుగుతుందనేది కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది

By:  Tupaki Desk   |   16 Jun 2024 2:30 PM GMT
మెగా vs అల్లు ఫైట్ పీక్స్.. పవన్ రిపేర్!
X

టాలీవుడ్ కు చెందిన మెగా, అల్లు కుటుంబాల మధ్య ఏం జరుగుతుందనేది కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటి నుంచో ఆ రెండు ఫ్యామిలీల మధ్య వైరం ఉందని రూమర్లు చాలా సార్లు వచ్చాయి. కానీ వాటిలో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. కొన్ని నెలల క్రితం నిర్మాత అల్లు అరవింద్.. ఓ షోలో పాల్గొని తమకు ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉందని తెలిపారు. ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ వల్ల మళ్లీ పెద్ద రచ్చ మొదలైంది!

ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసిన శిల్పా రవి ఇంటికి బన్నీ సతీ సమేతంగా వెళ్లారు. విష్ చేసి శిల్పా రవి కోసం హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తెలిపారు. ఈ విషయం మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. పవన్ మామయ్య కోసం కేవలం ట్వీట్ చేసి.. వైసీపీ అభ్యర్థికి ఇంటికి వెళ్లినందుకు విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో నాగబాబు ఒక్క ట్వీట్ తో మరింత అగ్గి రాజేశారు.

మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. అని పోస్ట్ పెట్టారు. దీంతో అది బన్నీని ఉద్దేశించే పెట్టారని అంతా అనుకున్నారు. ఇక మెగా, బన్నీ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున నెట్టింట మాటల యుద్ధం జరిగింది. అప్పుడు నాగబాబు.. ఎక్స్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చి ట్వీట్ డిలీట్ చేశానని మరో పోస్ట్ పెట్టారు. అలా వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. ఇంతలో ఎన్నికల ఫలితాలు రాగా.. పవన్ భారీ మెజార్టీతో గెలిచారు

పవన్ విజయం తర్వాత మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినీ ప్రముఖుల్లో దాదాపు అంతా విష్ చేశారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ విష్ చేసినట్లు కనిపించలేదు. అంతేకాదు చిరంజీవి ఇంట్లో జరిగిన గ్రాండ్ సెలబ్రేషన్స్ కు మెగా కుటుంబ సభ్యులంతా హాజరై ఘనంగా జరుపుకున్నారు. కానీ అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు. దీంతో మరోసారి ఈ విషయం చర్చల్లోకి వచ్చింది. రెండు కుటుంబాల మధ్య మరింత గ్యాప్ పెరిగిందన్న ఊహాగానాలు వినిపించాయి

ఇక సాయిధరమ్ తేజ్.. బన్నీతో పాటు స్నేహా రెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా... రెండు ఫ్యామిలీల నుంచి ఎవరూ స్పందించడం లేదు. ఇటీవల నిహారికను కమిటీ కుర్రోళ్ళు మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో అన్ ఫాలో కోసం అడగ్గా.. తనకు ఆ విషయం తెలియదని చెప్పింది. ఆ తర్వాత ఎవరి కారణాలు వారికి ఉంటాయని మరో డౌట్ క్రియేట్ చేసింది. దీంతో అన్ ఫాలో విషయం నిజమేనని మళ్లీ నెటిజన్లు అంటున్నారు.

ఇలా.. మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఏమో గానీ.. ఫ్యాన్స్ మధ్య కచ్చితంగా డిస్టన్స్ పెరిగిందనే చెప్పాలి. చాలా గ్యాప్ క్రియేట్ అయింది. దీంతో నెటిజన్లు.. రెండు ఫ్యామిలీల ఫ్యాన్స్ మధ్య అలా గ్యాప్ పెరగడం మంచిది కాదని అంటున్నారు. ఆ మధ్య నాగబాబు ట్వీట్ తర్వాత చిరంజీవి రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చినా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అంతా క్లియర్ చేయాలని అంటున్నారు. మరి పవన్.. ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారా లేదా అనేది చూడాలి.