Begin typing your search above and press return to search.

మ్యాడ‌మ్ టుస్సాడ్స్‌లో ఐకాన్ స్టార్ విగ్ర‌హం

'పుష్ప 2' చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ తీసుకుని మ‌రో రెండు రోజుల్లో బ‌న్ని నేరుగా లండ‌న్ మ్యాడ‌మ్ టుస్సాడ్స్ కి వెళ‌తార‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 4:52 AM GMT
మ్యాడ‌మ్ టుస్సాడ్స్‌లో ఐకాన్ స్టార్ విగ్ర‌హం
X

అమితాబ్ బ‌చ్చ‌న్, షారూఖ్ ఖాన్, షాహిద్ క‌పూర్ లాంటి బాలీవుడ్ హీరోల‌కు మ్యాడ‌మ్ టుస్సాడ్స్ లో మైన‌పు విగ్ర‌హాలు వెల‌సిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ప్ర‌భాస్, మ‌హేష్ లాంటి స్టార్ల‌కు మ్యాడ‌మ్ టుస్సాడ్స్ లో విగ్ర‌హాల్ని ఆవిష్క‌రించారు. ఇప్పుడు లండ‌న్ మ్యాడ‌మ్ తుస్సాడ్స్ లో జాతీయ అవార్డు గ్ర‌హీత‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్నారు. ఇటీవ‌ల‌ దీనిపై మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

'పుష్ప 2' చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ తీసుకుని మ‌రో రెండు రోజుల్లో బ‌న్ని నేరుగా లండ‌న్ మ్యాడ‌మ్ టుస్సాడ్స్ కి వెళ‌తార‌ని తెలిసింది. అక్క‌డ రెండు రోజుల పాటు త‌న మైన‌పు విగ్ర‌హానికి అవ‌స‌ర‌మైన కొల‌త‌లు ఇవ్వ‌డం స‌హా ఇత‌ర‌త్రా ఫార్మాలిటీస్ ని ముగించుకుని తిరిగి వ‌స్తాడ‌ని తెలిసింది. వ‌చ్చే ఏడాది ఈ మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ప్ర‌భాస్ - మ‌హేష్ త‌ర్వాత ప్ర‌తిష్ఠాత్మ‌క‌ మ్యాడ‌మ్ తుస్సాడ్స్ లో విగ్ర‌హం క‌లిగి ఉండే స్టార్ గా బ‌న్ని పేరు రికార్డుల‌కెక్క‌నుంది.

ఇటీవ‌లే పుష్ప చిత్రంలో న‌ట‌న‌కు గాను అల్లు అర్జున్ కి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ ద‌క్కింది. ఇదే ఉత్సాహంలో అత‌డు పుష్ప 2 ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లాల‌ని హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. పుష్ప 2తో అత‌డి రేంజ్ మ‌రో లెవ‌ల్ కి ఎద‌గ‌నుంద‌ని కూడా గుస‌గ‌సలు వినిపిస్తున్నాయి.

సెన్సేష‌న‌ల్ రికార్డ్స్ పై బ‌న్ని క‌న్ను: అల్లు అర్జున్ న‌టిస్తున్న 'పుష్ప 2' 15 ఆగస్ట్ 2024న విడుద‌ల కానుంది. పుష్ప-1 భారీ విజయం తర్వాత, మేకర్స్ సీక్వెల్ ని భారీ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. పుష్ప డిసెంబర్ 2021లో విడుదలైంది. తెలుగు మాట్లాడే ప్రాంతాలలోనే కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా భారీ విజయాన్ని సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేప‌థ్యంలో యాక్షన్ డ్రామా అన్నివ‌ర్గాల‌ను ర‌క్తి క‌ట్టించింది. ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

పుష్ప 2: ది రూల్ 2024 మోస్ట్ అవైటెడ్ సినిమాగా విడుద‌ల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో పుష్ప 2 ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేయ‌గా అద్భుత స్పంద‌న ద‌క్కింది. బ‌న్ని ఈ సీక్వెల్లో విల‌క్ష‌ణ వేష‌ధార‌ణ‌తో ఆక‌ట్టుకోబోతున్నాడ‌ని క్లూ దొరికింది. త్వరలో రష్మిక మందన్న లుక్ పోస్టర్ కూడా విడుదల చేస్తారని అభిమానులు ఊహిస్తున్నారు.

అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు సాయి పల్లవి కూడా ఈ సినిమాలో జాయిన్ అయినట్లు సమాచారం. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ నటుడు ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. మాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఉత్త‌రాదినా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ద్వారా 1000 కోట్ల క్ల‌బ్ లో చేరాల‌ని పుష్ప‌2 టీమ్ బిగ్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది.