Begin typing your search above and press return to search.

నేను ఎన్ని చెప్పినా వాళ్ళు అంటూనే ఉన్నారు

చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

By:  Tupaki Desk   |   26 Jun 2024 10:26 AM GMT
నేను ఎన్ని చెప్పినా వాళ్ళు అంటూనే ఉన్నారు
X

చేతిలో రెండు నిర్మాణ సంస్థలు, అత్యంత సన్నిహితులు అయిన పలువురు నిర్మాతలు ఉన్నా కూడా అల్లు శిరీష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం లేదు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తుంటే అల్లు శిరీష్ మాత్రం మెల్లగా సినిమాలు చేస్తూ ఉన్నాడు.

చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ మధ్య తమిళంలో వచ్చిన ఒక సినిమాకు ఇది రీమేక్ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే శిరీష్ మాత్రం ఇది రీమేక్ కాదురా బాబూ అంటూ పదే పదే చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

బడ్డీ ట్రైలర్ లాంచ్‌ వేడుక వైభవంగా జరిగింది. చిన్న పిల్లల సినిమా అవ్వడంతో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి శ్రేయాస్ శ్రీనివాస్ విభిన్నంగా ప్లాన్‌ చేసి, చిన్న పాపతో హోస్టింగ్‌ చేయించాడు. పాప హోస్టింగ్‌ కి మంచి స్పందన వచ్చింది. సినిమాకు కూడా మంచి పబ్లిసిటీ దక్కింది.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు శిరీష్ మాట్లాడుతూ... గత సంవత్సరం బడ్డీ పోస్టర్ ను విడుదల చేసిన సమయంలో చాలా మంది మళ్లీ రీమేక్ చేస్తున్నావా, తమిళ సినిమాకు ఇది రీమేకా అన్నట్లుగా ప్రశ్నించారు. ఇలాంటి సినిమాను మేము ఓటీటీ లో చూశాం అని కూడా చాలా మంది నాతో అన్నారు.

నేను ఎన్ని సార్లు వాళ్లకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా కూడా మళ్లీ మళ్లీ వారు అదే అనుకుంటున్నారు. నేను చెప్పేది వినిపించుకోకుండా వాళ్లు అంటూనే ఉన్నారు. సినిమా విడుదల తర్వాత ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి అర్థం అవుతుంది. టెడ్డీ బేర్‌ తో అడ్వెంచర్‌ యాక్షన్ మూవీ ఇది.

పిల్లలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా ఈ సినిమా నచ్చుతుందని, దర్శకుడు ఈ సినిమాను మంచి కాన్సెప్ట్ తో రూపొందించాడు అంటూ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మరియు అధన జ్ఞానవేల్ లు అన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ కి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో సినిమా విడుదల కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.