Begin typing your search above and press return to search.

ఇన్‌స్టాలో నా ఏడుపుకు కారణం అదే...!

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 3:30 PM GMT
ఇన్‌స్టాలో నా ఏడుపుకు కారణం అదే...!
X

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులో ఈ అమ్మడు విజయ్ దేవరకొండకి జోడీగా లైగర్ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా కెరీర్ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఈ అమ్మడు మెల్ల మెల్లగా బాలీవుడ్‌లో పాతుకు పోయేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతూ ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అనన్య పాండే అప్పుడప్పుడు ఏడుస్తున్న ఫోటోలు, కళ్లలో నీళ్లు ఉన్న ఫోటోలను షేర్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేయడంతో పాటు, ఎందుకు అలా చేస్తుందని అనుమానం కలిగేలా చేస్తుంది.

తాజాగా ఒక చిట్‌చాట్‌లో అనన్య పాండే ఆ విషయమై స్పందించింది. చాలా మంది నవ్వితే బాగుంటారు. అయితే నన్ను మాత్రం కొందరు ఏడుస్తున్నప్పుడు భలే ఉంటావు, క్యూట్‌ గా ఉంటావు అన్నారు. అందుకే సోషల్‌ మీడియాలో నేను షేర్ చేసే ఫోటోలు కొన్ని ఏడుస్తూ ఉంటాయి. జనాలు నన్ను ఎలా నచ్చినా నేను అలా ఉండాలి అనుకుంటాను. అందుకే నేను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఏడుస్తున్న ఫోటోలను షేర్‌ చేస్తాను. ప్రతిసారి నవ్వుతున్న ఫోటోలను మాత్రమే కాకుండా ఏడుస్తున్న ఫోటోలను షేర్ చేయడం ద్వారా ప్రేక్షకులు తనను కొత్తగా, ఎప్పుడూ ఒకేలా కాకుండా చూస్తారు అంటూ అనన్య పాండే కొత్త లాజిక్ ను వింతగా చెప్పింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో అందరు హీరోయిన్స్‌ అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం కామన్‌. అయితే అనన్య మాత్రం అందమైన ఫోటోలతో పాటు, అప్పుడప్పుడు ఏడుస్తున్న పోటోలను షేర్‌ చేసి తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌ గా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్దకు రాబోయే రోజుల్లో బ్యాక్ టు బ్యాక్‌ రాబోతున్నాయి. తెలుగులో ఈమె చేసిన లైగర్ సినిమా నిరాశ పరచడం జరిగింది. అయినా ఒకటి రెండు టాలీవుడ్‌ సినిమాల ఆఫర్లు ఈ అమ్మడి వద్దకు వచ్చాయట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలకు నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు చుంకీ పాండే వారసురాలిగా 2019లో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఈ అమ్మడు హిందీ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుందని భావిస్తున్న సమయంలో కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు పెద్దగా సినిమాలు చేయకుండానే ఖాళీగా ఉంది. కరోనా తర్వాత లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. బాలీవుడ్‌లో ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. భవిష్యత్తులో మళ్లీ సౌత్‌ సినిమాల్లో నటిస్తాను అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మరి ఎప్పటికి ఈమె మళ్లీ తెలుగు లో నటిస్తుందో చూడాలి.