Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండతో వివాదం… అనసూయ మరో క్లారిటీ

యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం స్టార్ యాక్టర్ గా దూసుకుపోతున్న అందాల భామ అనసూయ

By:  Tupaki Desk   |   24 July 2024 12:06 PM GMT
విజయ్ దేవరకొండతో వివాదం… అనసూయ మరో క్లారిటీ
X

యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం స్టార్ యాక్టర్ గా దూసుకుపోతున్న అందాల భామ అనసూయ. క్షణం సినిమాతో నటిగా మారిన అనసూయకి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ వచ్చింది. తరువాత రంగస్థలం సినిమా అనసూయ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం హోస్ట్ గా టీవీషోలకి దూరమైనా అనసూయ గెస్ట్ గా లేదంటే జడ్జ్ గా కొన్ని షోలలో సందడి చేస్తోంది. అనసూయ నటించిన శింబ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె మెయిన్ లీడ్ గా శింబ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. సంపత్ నంది ఈ సినిమాకి కథ అందించడంతో పాటు, దాసరి రాజేందర్ రెడ్డితో కలిసి నిర్మించారు. మురళీ మనోహర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఆగష్టు 9న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ రీలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా మీట్ కండక్ట్ చేసింది. ఇందులో శింబ మూవీ గురించి ఆసక్తికర విషయాలు అనసూయ పంచుకుంది. శింబ మూవీ ట్రైలర్ లో ఓ చోట విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడు అనే డైలాగ్ ఉంటుంది. దీనిపై రియాక్ట్ అవుతూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వివాదం గురించి జర్నలిస్టులు అనసూయని ప్రశ్నించారు.

అనసూయ మీడియా అడిగిన ప్రశ్నలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అర్జున్ రెడ్డి మూవీ సమయంలో అనసూయకి విజయ్ దేవరకొండకి మధ్య వివాద మొదలైంది. ట్విట్టర్ ద్వారా అనసూయ చేసిన కామెంట్స్ ఎంతగానో వైరల్ అయ్యాయి. తరువాత మరోసారి కూడా విజయ్ పై ఆమె ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. విజయ్ దేవరకొండతో వివాదం ఇంకా కొనసాగుతుందా అని జర్నలిస్ట్ లు అనసూయని ప్రశ్నించారు.

విజయ్ తో ప్రస్తుతం తనకి ఎలాంటి వివాదం లేదని అనసూయ క్లారిటీ ఇచ్చింది. అప్పుడు కూడా అతని స్టేజ్ మేనర్స్ మీద రియాక్ట్ అయ్యానని తెలిపింది. ఫేమ్ వచ్చి లైమ్ లైట్ లో ఉన్నవారు కాస్తా పద్ధతిగా ఉండాలని, దాని గురించే తాను మాట్లాడాల్సి వచ్చిందని అనసూయ చెప్పింది.

నిజానికి దీనిపై మీడియా వారు ప్రశ్నించాలని అనసూయ చెప్పుకొచ్చింది. మీడియా బాధ్యత తీసుకొని ఉంటే ఈ వివాదం తలెత్తేది కాదని అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఆ ఇష్యూతో తాను చాలా నేర్చుకున్నానని అనసూయ తెలిపింది. చెప్పాలని అనుకున్న విషయాన్ని సరైన విధంగా కన్వే చేస్తే ఇష్యూ సీరియస్ అయ్యేది కాదని అనసూయ చెప్పింది.