Begin typing your search above and press return to search.

సీక్వెల్ ప్లాన్ చేస్తున్న 'అర్జున్ రెడ్డి' దర్శకుడు!

విజయ్‌ దేవరకొండతో 'అర్జున్‌ రెడ్డి' సినిమాను రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక్క సినిమా తో పాన్ ఇండియా దర్శకుడిగా మారి పోయాడు

By:  Tupaki Desk   |   7 Nov 2023 1:30 PM GMT
సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అర్జున్ రెడ్డి దర్శకుడు!
X

విజయ్‌ దేవరకొండతో 'అర్జున్‌ రెడ్డి' సినిమాను రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక్క సినిమా తో పాన్ ఇండియా దర్శకుడిగా మారి పోయాడు. అర్జున్ రెడ్డిని హిందీ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అర్జున్‌ రెడ్డి తో వచ్చిన క్రేజ్ తో ఏకంగా రణబీర్ కపూర్ తో 'యానిమల్‌' సినిమాను చేస్తున్నాడు.

డిసెంబర్‌ 1న రాబోతున్న యానిమల్‌ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇప్పటికే విడుదల అయిన పాటలు మరియు ప్రోమోతో అర్థం అవుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్నా ఈ సినిమా తో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము దులపడం ఖాయం అంటున్నారు.

యానిమల్‌ సినిమా ను ఏకంగా 3.30 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంత నిడివితో సినిమాను విడుదల చేయడం అంటే కచ్చితంగా సాహస నిర్ణయం. సినిమా పై చాలా నమ్మకం ఉండటం వల్లే దర్శకుడు సందీప్ వంగ ఈ సాహస నిర్ణయం తీసుకున్నాడు అంటూ కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక యానిమల్ సినిమాకు సీక్వెల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొదటి పార్ట్‌ లో సీక్వెల్‌ కి సంబంధించిన లీడ్ ను ఇచ్చి రెండో భాగం ఉంటుందని చెప్తారట. యానిమల్ కచ్చితంగా సూపర్‌ హిట్ అవుతుందనే ఉద్దేశ్యంతో సీక్వెల్‌ ను కూడా ప్లాన్ చేసి ఉంటారు అంటున్నారు.

మొత్తానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చాలా ధీమాతో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ను ప్రకటించిన విషయం తెల్సిందే. మరో వైపు అల్లు అర్జున్‌ తో కూడా ఒక సినిమాను సందీప్ వంగ ప్రకటించాడు. ఇప్పుడు యానిమల్‌ సినిమా సీక్వెల్‌ అంటున్నాడు. లైనప్ చూస్తే మామూలుగా లేదు.. యానిమల్‌ హిట్ అయితే మోస్ట్ వాంటెడ్‌ డైరెక్టర్ గా సందీప్ వంగ నిలిచే అవకాశాలు ఉన్నాయి.