Begin typing your search above and press return to search.

యానిమల్ టీజర్​.. పీక్స్​ లెవల్​లో రణ్​బీర్ వైలెన్స్​

సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యానిమల్‌ ఒకటి. సందీప్‌ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ఇది తెరకెక్కుతోంది

By:  Tupaki Desk   |   28 Sep 2023 6:01 AM GMT
యానిమల్ టీజర్​.. పీక్స్​ లెవల్​లో రణ్​బీర్ వైలెన్స్​
X

సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యానిమల్‌ ఒకటి. సందీప్‌ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ఇది తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్​గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీటీమ్ రిలీజ్ చేసింది.

గతంలో ఈ సినిమా నుంచి చిన్న ప్రీ టీజర్​ను విడుదల చేసి ఆడియన్స్​ను ఆకట్టుకున్న మేకర్స్ తాజాజా ఫుల్​ టీజర్​తో సినిమా అంచనాలను పెంచారు. నేడు రణబీర్ పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే సినిమాను ఫాదర్ అండ్ సన్ బాండింగ్​ నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కించారని అర్ధమవుతోంది.

అనిల్ కపూర్.. రణబీర్​కు తండ్రిగా కనిపించారు. ఆద్యంతం ఈ ప్రచార చిత్రం యాక్షన్​తో నింపి.. సినిమాలో వైలెన్స్ ఏ రేంజ్​లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఓ టిపికల్ కథలా అనిపిస్తుంది. సినిమాలో అసలు విలన్ ఎవరు అన్నది క్లారిటీగా తెలియలేదు. క్రిమినల్ కొడుకుని కన్నామని అంటూ అనిల్ కపూర్ చెప్పన డైలాగ్​.. రణ్​బీర్ వైలైన్స్​ను ఎలివేట్ చేస్తోంది. హీరో క్యారెక్టర్​ సస్పెన్స్​గానే ఉంది. కొన్ని చోట్ల రణ్​బీర్​ కపూర్ కూల్​గా సాఫ్ట్​ లుక్​లో కనిపించినప్పటికీ.. మరి కొన్ని చోట్ల ఎంతో వైలెంట్​గా విలన్లు వేటాడుతూ చంపుతూ వైల్డ్​గా కనిపిస్తున్నారు. రణ్​బీర్ వేరియేషన్స్​ బాగా చూపించారు.

నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా సమాధానం చెబుతాను. కానీ మా నాన్న గురించి మాత్రం అడగకు.. మా నాన్న ఈ ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్. నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకు ఎక్కడా కనపడలేదు. నాలో నేను చూసుకుంటే. నా కన్నా చెడ్డవాడు లేడు. నాన్నా ఇది ఇప్పుడే మొదలైంది. నేను వాడిని కనిపెట్టాలి, కలవాలి, చంపాలి. మీరు నిరాశ పడకండి నాన్నా అంటూ రణ్ బీర్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నారు. మరి గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన హీరో.. వైలైన్స్​ను ఎందుకు ఎంచుకున్నాడు? అతడు ఎవరిని కనిపెట్టి చంపాలి అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా, ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్​గా నటించింది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ సినిమాను గ్రాండ్ బడ్జెట్​తో నిర్మించింది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ వైలెన్స్​ మూవీ ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.