Begin typing your search above and press return to search.

జ‌న‌సేనాని విక్ట‌రీ.. ప్ర‌జ‌ల‌కు అన్నా లెజ‌నోవా అభివాదం

స‌తీమ‌ణి స్వ‌యంగా ప‌వ‌న్ కి హార‌తి ఇచ్చి లోనికి ఆహ్వానించిన‌ దృశ్యాలు వైర‌ల్ అయ్యాయి

By:  Tupaki Desk   |   4 Jun 2024 4:48 PM GMT
జ‌న‌సేనాని విక్ట‌రీ.. ప్ర‌జ‌ల‌కు అన్నా లెజ‌నోవా అభివాదం
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో జనసేన పార్టీ (జేఎస్పీ) అధినేత పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జ‌న‌సేన పార్టీ 21 స్థానాల‌ను గెలుచుకోవ‌డం గ్రేట్ విక్ట‌రీగా అభివ‌ర్ణిస్తున్నారు. న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు అయిన ప‌వ‌న్ ని విజ‌యానంత‌రం భార్య అన్నా లెజినోవా ఎంతో సంతోషంగా చిరునవ్వులతో స్వాగతించారు. స‌తీమ‌ణి స్వ‌యంగా ప‌వ‌న్ కి హార‌తి ఇచ్చి లోనికి ఆహ్వానించిన‌ దృశ్యాలు వైర‌ల్ అయ్యాయి.

ప‌వ‌న్ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసేందుకు ఇంటికి వ‌చ్చిన అభిమానులంద‌రికీ అన్నా లెజనోవా అభివాదం చేసారు.

అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్, ఆయ‌న‌ మాజీ భార్య రేణు దేశాయ్ కుమారుడు అకిరా నందన్ ఈ ఫోటోగ్రాఫ్‌లో క‌నిపించారు. ముఖ్యంగా అన్నా లెజినోవా ప‌వ‌న్ జీవితంలో ప్ర‌తి విజ‌యానికి బాస‌ట‌గా నిలుస్తున్న తీరు అభిమానుల్లో ఆనందం నింపుతోంది.

పవన్ కళ్యాణ్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోదరుడికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. ''ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కూటమి గెలుపు కోసం నా ప్రియమైన సోదరుడు పవన్ కళ్యాణ్ ఎలా పట్టుదలతో కృషి చేశారో చూశాను. ఈ విజ‌యానికి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు'' అని విషెస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు సాయి ధరమ్ తేజ్, నితిన్‌ సహా ఇతర ప్రముఖులు సోషల్ మీడియాలో జ‌న‌సేనానికి అభినందనలు తెలిపారు.