Begin typing your search above and press return to search.

అత్యాచారం కేసులో మ‌రో న‌టుడు అరెస్ట్

ఓ మ‌హిళా న‌టి ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేష‌న్ లో ఇడ‌వేలు బాబుపై అత్యాచారం కేసు పెట్టింది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 10:22 AM GMT
అత్యాచారం కేసులో మ‌రో న‌టుడు అరెస్ట్
X

జస్టిస్ హేమ క‌మిటీ నివేదిక దెబ్బ‌కి ఒక్కొక్క‌రుగా క‌ట‌క‌టాల‌పాల‌వుతున్నారు. తాజాగా మ‌రో మ‌ల‌యాళ న‌టుడు అరెస్ట్ అయ్యాడు. `అమ్మ‌` మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న‌టుడు ఇడ‌వేలు బాబును అత్యాచారం కేసులో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. ఓమ‌హిళా న‌టి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఓ మ‌హిళా న‌టి ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేష‌న్ లో ఇడ‌వేలు బాబుపై అత్యాచారం కేసు పెట్టింది.

బాబు అమ్మ‌లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలోనే అమ్మ‌లో స‌భ్య‌త్వం నిమిత్తం. క‌లూరులోని ఆయ‌న నివాసానికి వెళ్ల‌గా త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని గంట‌ల క్రిత‌మే మ‌ల‌యాళ న‌టుడు సిద్దీఖీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రారీలో ఉన్న సిద్దీఖిని ప‌ట్టుకునేందుకు పోలీసులు తీవ్ర గాలింపు చేప‌డుతున్నారు. ఆయ‌న ముందొస్తు బెయిల్ ని కూడా కోర్టు తిర‌స్క‌రించింది. దీంతో సిద్దీకీ ఎక్క‌డ ఉన్నాడు? అనే దానిపై పోలీసులు గాలింపు వేగ‌వంతం చేసారు.

దీంతో మ‌ల‌యాళం న‌టుల అరెస్ట్ ప‌ర్వం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మ‌వుతోంది. వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. హేమ క‌మిటీ నివేదిక‌లో భాగంగా ఇంకా న‌టుడు జ‌య‌సూర్య‌, ముకేష్‌, మ‌ణియ‌న్ పిళ్లై రాజు, ద‌ర్శ‌కుడు రంజిత్ స‌హా ప‌లువురు న‌టుల‌పై అత్యాచార ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. వీళ్ల‌పై కూడా కేసులు న‌మోదు చేసి అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది.

ఇటీవ‌లే టాలీవుడ్ లో కూడా ఇలాంటి కేసు ఒక‌టి వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ జూనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ పై అత్యాచార అరోప‌ణ‌లతో జైలు పాల‌య్యాడు. అత‌డిప్పుడు చంచ‌ల్ గూడ జైల్లో ఉన్నాడు. 14 రోజుల రిమాండ్ లో భాగంగా పోలీసులు విచార‌ణ నిమిత్తం క‌స్ట‌డీకి ఇచ్చిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.