Begin typing your search above and press return to search.

‘3 ఇడియ‌ట్స్’లో ఇద్ద‌రికి వైర‌స్‌.. ‘ఆల్ ఈజ్ వెల్’ మంత్రం చెప్పిన హీరో!

By:  Tupaki Desk   |   25 March 2021 1:30 PM GMT
‘3 ఇడియ‌ట్స్’లో ఇద్ద‌రికి వైర‌స్‌.. ‘ఆల్ ఈజ్ వెల్’ మంత్రం చెప్పిన హీరో!
X
కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. సాధారణ జనంతోపాటు దేశంలో పలు రాజకీయ, సినీ ప్రముఖులు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా.. ప్రముఖ నటుడు మాధవన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించిన మాధవన్.. ఇందులోనూ సెన్సాఫ్ హ్యూమర్ ను మిక్స్ చేశాడు.

2009 బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘3 ఇడియట్స్’లో అమీర్ ఖాన్‌, శ‌ర్మ‌న్ జోషితోపా‌టు మాధ‌వ‌న్ కూడా న‌టించిన విష‌యం తెలిసిందే. అనుకోకుండా ఈ ముగ్గురిలో అమీర్‌, మాధ‌వ‌న్ కొవిడ్ వైర‌స్ కు చిక్కారు. ఇదే విష‌యాన్ని ఫ‌న్నీగా పోస్టు చేశాడు మ్యాడీ.

ఆ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ ను షేర్ చేశాడు. ‘‘రాంచో(అమీర్‌)ను ఫ‌ర్హాన్‌(మాధ‌వ‌న్‌) ఫాలో అవుతుంటే.. వైర‌స్ (ప్రిన్సిపాల్ బొమ‌న్ ఇరానీ) మా ఇద్ద‌రి వెంట‌ప‌డేవాడు. అయితే.. ఈ సారి వీడికి (క‌రోనా వైర‌స్‌) మేము చిక్కాము.’’ అంటూ ఫన్ క్రియేట్ చేశాడు.

ఇప్పటి వరకు ఆరోగ్యం బాగుందని అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నానని రాసుకొచ్చిన‌ మాధవన్.. ‘ఆల్ ఈజ్ వెల్’ మంత్రాన్ని ఇక్కడ కూడా పఠించారు. అయితే.. తమ ఫ్రెండ్ రాజు (శర్మన్ జోషి) మాత్రం ఈ ఒక్కచోటికి త‌మ‌తో రావొద్ద‌ని కోరుకుంటున్నానని అన్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ పోస్టు వైర‌ల్ అవుతోంది.