Begin typing your search above and press return to search.

నర్సుగా మారిన నటి.. కరోనా రోగులకు సేవలు

By:  Tupaki Desk   |   31 March 2020 7:00 AM IST
నర్సుగా మారిన నటి.. కరోనా రోగులకు సేవలు
X
ఏదైనా ఉపద్రవం వచ్చిందంటే చాలు లక్షలు, కోట్లు విరాళాలు ప్రకటిస్తారు మన సినీ ప్రముఖులు. కానీ స్వయంగా ఆ కష్టంలో పాలు పంచుకుందామని జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ కరోనా టైం లో అయితే ఎవరూ ఆ సాహసమే చేయడం లేదు. కానీ ఈ నటి మాత్రం డేరింగ్ స్టెప్ వేసింది. ఏకంగా ఆస్పత్రికెళ్లి కరోనా రోగులకు సేవలు చేసింది. అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా అత్యంత ధైర్యసాహసాలు కనబరిచింది. షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ సినిమాలో ఓ పాత్ర పోషించిన శిఖ ముంబైలోని ఆస్పత్రికి వెళ్లి నర్సుగా మారి కరోనా రోగులకు చికిత్స నందిస్తోంది.

ఈమె గతంలో ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీలో శిఖా నర్సింగ్ కోర్సును పూర్తి చేసింది. అయితే నటిగా సెటిల్ అయ్యింది. ఈ కరోనా సమయంలో వైరస్ తో పోరాడిన వారిని కాపాడుకునేందుకు ఏకంగా నర్సుగా మారి సేవలందిస్తోంది.

నాకు తెలిసిన విద్యనే ఉపయోగిస్తున్నానని.. దేశ సేవ కోసం ఎప్పుడూ ముందుంటానని.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండాలని శిఖ తను నర్సుగా చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది.