Begin typing your search above and press return to search.

ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..

By:  Tupaki Desk   |   11 April 2019 10:21 AM GMT
ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..
X
కొన్ని రోజుల క్రితం నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోషల్‌ మీడియాలో ఆమె గురించి పెద్ద చర్చ జరిగిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కూడా పలు సందర్బాల్లో కస్తూరి తన నోటి దురుసును బయట పెడుతూనే వచ్చింది. తాజాగా మరోసారి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ సందర్బంగా చెన్నైలో కోల్‌ కత్తా మరియు చెన్నైలో మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ లో కోల్‌ కత్తా బ్యాటింగ్‌ చాలా మందకోడిగా సాగింది. ఆ విషయమై కస్తూరి సోషల్‌ మీడియాలో స్పందిస్తూ ఎంజీఆర్‌ ను ఇన్వాల్వ్‌ చేసింది. దాంతో తమిళనాడ పలువురు కస్తూరిపై మండి పడుతున్నారు.

ఇంతకు కస్తూరి కోల్‌ కత్తా బ్యాట్స్‌ మన్‌ పై ఏమని కామెంట్స్‌ చేసిందంటే... వీళ్ల బ్యాటింగ్‌ చూస్తుంటే పళ్లాండు వాళ్గ చిత్రంలో లతను వాద్యియార్‌ తడిమినట్లుగానే ఉంది కదా అంటూ కామెంట్స్‌ చేసింది. ఇక్కడ వాద్యియార్‌ అంటే ఎంజీఆర్‌. ఆ సినిమాలోని పాత్రను ఇలా టార్గెట్‌ చేసింది. కస్తూరి చేసిన వ్యాఖ్యలపై లత మరియు ఎంజీఆర్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు.

సీనియర్‌ నటి లత మాట్లాడుతూ.. ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు - లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు అణుకువ - నాగరికం అవసరం. ఎంజీఆర్‌ గారితో కలిపి నన్ను విమర్శలు చేసే స్థాయా నీది - నీవు నటించిన దాని కంటే ఎక్కువ మేము ఏమీ నటించలేదు అంటూ చెప్పుకొచ్చింది. నీ సినిమాల్లో నీవు చేసిన సీన్స్‌ గురించి మాట్లాడితే అప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటాం అంటూ సోషల్‌ మీడియా జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి కస్తూరి గురించి మరోసారి సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతోంది.