Begin typing your search above and press return to search.

ఆ మహిళలతో ఉండటం ఆనందంగా ఉంది - అడవి శేష్

By:  Tupaki Desk   |   10 Feb 2023 1:02 PM GMT
ఆ మహిళలతో ఉండటం ఆనందంగా ఉంది - అడవి శేష్
X
టాలీవుడ్ లో తన మార్క్ స్టోరీ టెల్లింగ్ తో ఎంతో పేరు తెచ్చుకున్నాడు అడవి శేష్. ప్రత్యేక కథలతో థ్రిల్లింగ్, సస్పెన్స్ నేపథ్యంలో సినిమాలు తీస్తూ హిట్ మీద హిట్ కొడుతున్నాడు. తాజాగా హిట్-2తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ టాలర్ స్టార్. తాజాగా ఈ హీరో తన ఇన్ స్టా వేదికగా చేసిన ఓ పోస్టు చాలా మందిని ఆకట్టుకుంటోంది.

అందులో అడవి శేష్ తో పాటు బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ అయిన ఫరాఖాన్, బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో కలిసి ఉన్న పిక్ ను పోస్టు చేశారు. ఫరాఖాన్ డైరెక్టర్ గా అడవి శేష్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కనుందని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే వీరు కలిసింది సినిమా కోసం కాదు. హైదరాబాద్ లో జరిగిన ఫిక్కీ సమావేశానికి వీరు హాజరయ్యారు.

ఓ పిక్ లో అడవి శేష్, ఫరాఖాన్, పూజా హెగ్డేతో పాటు ఫిక్కీ ఫ్లో మాజీ ప్రెసిడెంట్ పింకీ రెడ్డితో కలిసి కనిపించారు. మరో పిక్ లో అడవి శేష్, ఫరాఖాన్, పింకీ రెడ్డి ఉన్నారు. ఈ రెండు పిక్స్ పోస్టు చేసిన అడవి శేష్.. వీరితో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు క్యాప్షన్ ఇచ్చారు.

సూపర్ వైబ్రంట్ ఫరా ఖాన్, లవ్లీ పూజా హెగ్డే లాంటి విజయవంతమైన, విద్యావంతులైన మహిళలతో కలిసి సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పోస్టులో పేర్కొన్నాడు.

ఈ యంగ్ హీరో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. గూఢచారి, ఎవరు, మేజర్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన అడవి శేష్.. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఈ క్రమంలో ఇటీవలె హిట్-2 తో మరో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో తదుపరి రెండు సినిమాలతోనూ హిట్లు అందుకుని డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయాలని ప్లాన్ వేశాడు. ఈక్రమంలోనే గూఢచారికి సీక్వెల్ గా జీ-2 ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. మేజర్ తో దక్కిన పాన్ ఇండియా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేలా ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.