Begin typing your search above and press return to search.

స్టేజ్ పై లేడీ ప్రొడ్యూసర్‌ కి క్షమాపణ చెప్పిన యంగ్‌ హీరో

By:  Tupaki Desk   |   14 Sep 2022 12:30 AM GMT
స్టేజ్ పై లేడీ ప్రొడ్యూసర్‌ కి క్షమాపణ చెప్పిన యంగ్‌ హీరో
X
యంగ్‌ హీరో అడవి శేష్‌ నిన్న రాత్రి జరిగిన సాకిని డాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొన్నాడు. ఈ వారం విడుదల కాబోతున్న ఆ సినిమాని సునీత తాటి నిర్మించారు. సినిమా నిర్మాత అయిన సునీత తాటి గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడవి శేష్‌ మాట్లాడుతూ క్షమాపణ చెప్పాడు. ఈ విషయాన్ని ఆమెకి వ్యక్తిగతంగా కూడా కలిసి చెప్పానని మరోసారి మీ అందరి ముందు కూడా సునీత గారికి సారి చెబుతున్నాను అంటూ అడవి శేష్‌ అన్నాడు.

నిర్మాత సునీత కి అడవి శేష్‌ సారి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఇటీవల అడవి శేష్‌ మేజర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో అడవి శేష్ తో పాటు కీలక పాత్రలో శోభిత ధూళిపాళ్ల నటించారు. శోభిత పాత్ర సినిమాలో అత్యంత కీలకంగా ఉంటుంది. ఆ పాత్రకు తల్లి పాత్రలో నిర్మాత సునీత తాటి నటించారు.

సినిమా కోసం సునీత తాటి పై సన్నివేశాలు కూడా చిత్రీకరించడం జరిగింది. కానీ చివరికి ఆ సన్నివేశాలను లేకుండానే సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. ఒక్క సన్నివేశం లో కూడా సునీత తాటి కనిపించలేదు. రన్‌ టైమ్‌ ఎక్కువ అయ్యింది అనే ఉద్దేశ్యంతో ఆమె నటించిన అన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని అడవి శేష్‌ పేర్కొన్నాడు.

ఆమెను సినిమాలో చూపించి ఉంటే బాగుండేదని తాను కూడా అనుకున్నాను. కానీ రన్‌ టైమ్‌ విషయంలో ఏం చేయలేక పోయాం అంటూ అడవి శేష్‌ పేర్కొన్నాడు. సినిమాలో ఆమె మంచి పాత్ర ను చేశారని.. కానీ అది రాకుండా పోయిందని శేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఆమెను పర్సనల్ గా కలిసి ఒక గిఫ్ట్‌ ఇచ్చి మరీ క్షమాపణ చెప్పాడట.

పర్సనల్ గా క్షమాపణ చెప్పడం తో పాటు ఇప్పుడు అందరి ముందు స్టేజ్ పై ఆమెకు క్షమాపణ చెప్పడం శేష్‌ యొక్క మంచి మనసు అన్నట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అడవి శేష్‌ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ మధ్య కొద్దిపాటి విశ్రాంతి తీసుకుని మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈయన మొదటగా హిట్‌ 2 తో రావాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.