Begin typing your search above and press return to search.

ధనుష్ మాజీ భార్య‌ ద‌ర్శ‌క‌త్వంలో శింబు

By:  Tupaki Desk   |   15 March 2022 4:37 AM GMT
ధనుష్ మాజీ భార్య‌ ద‌ర్శ‌క‌త్వంలో శింబు
X
సెల‌బ్రిటీ క‌పుల్స్ విచ్ఛిన్న కాపురాలు ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొన్ని వ‌రుస విడాకుల ప్ర‌క‌ట‌న‌ల త‌ర్వాత స్టార్ హీరో ధ‌నుష్ - ఐశ్వ‌ర్య దంప‌తులు కూడా విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి షాకిచ్చారు. 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక ఇక వెనుదిరిగి చూడ‌డం లేదు. ప్రస్తుతం ఐశ్వర్య తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించారు.

ఐశ్వర్య ద‌ర్శ‌కురాలిగా మ‌రింత బిజీ అయ్యారు. త‌న కెరీర్ సంగ‌తి విశ్లేషిస్తే.. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 2012 లో విడుద‌లైంది. 3 అనేది మూవీ టైటిల్. ఇందులో ధ‌నుష్ - శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టించారు. ఆ తరువాత 2015లో `వై రాజా వై`కి ఐశ్వ‌ర్య‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. 2017లో ఐశ్వర్య స్టంట్ మెన్ పై ఒక డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. దానికి `సినిమా వీరన్` అనే టైటిల్ పెట్టారు.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన యానిమేష‌న్ మూవీ కొచ్చాడ‌యాన్ కి ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ దర్శకురాలిగా మారాలని ఐశ్వ‌ర్య‌ ప్లాన్ చేస్తోంది. త్వరలో శింబుతో సినిమా చేసే ఆలోచనలో ఐశ్వర్య ఉన్నట్టు కోలీవుడ్ మీడియా పేర్కొంది.

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని స‌మాచారం. వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్త తమిళ సినీ వర్గాల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

నిజానికి ధ‌నుష్ కి శింబుకి మ‌ధ్య మాట‌ల్లేవ‌ని వివాదాలున్నాయ‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. ఇప్పుడు ఐశ్వ‌ర్య త‌న‌ని డైరెక్ట్ చేయాల‌నుకోవ‌డం ధ‌నుష్ అభిమానుల‌కు రుచిస్తుందా? అంటూ ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. మానాడు చిత్రంతో శింబు హిట్టందుకుని పాతు తాళ - వెందు తానింధాతు కాదు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ధ‌నుష్ కూడా ర‌క‌ర‌కాల ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.