Begin typing your search above and press return to search.

క్రైమ్ గేమ్ మొద‌లుపెట్టిన అజయ్ దేవ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   17 Feb 2022 8:30 AM GMT
క్రైమ్ గేమ్ మొద‌లుపెట్టిన అజయ్ దేవ‌గ‌న్‌
X
బాలీవుడ్ హీరోలు ద‌క్షిణాది చిత్రాల‌పై క‌న్నేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌. ప్ర‌స్తుతం ఆయ‌న కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన ఈ చిత్రాన్ని రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు.

ఈ మూవీ మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ మూవీలో అజ‌య్ దేవ‌గ‌న్ ఇద్దురు సూప‌ర్ స్టార్ ల‌కు గురువుగా అత్యంత కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే అజ‌య్ దేవ‌గ‌న్ మ‌రో సౌత్ సినిమాపై క‌న్నేశారు. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ `దృశ్యం -2`. ఈ చిత్రం గ‌త ఏడాది ఓటీటీలో విడుద‌లై సంచల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. మీనా - అన్సిబా హ‌స‌న్ - ఏస్త‌ర్ అనిల్, ఆశా శ‌ర‌త్ - సిద్ధిక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన `దృశ్యం` చిత్రానికిది సీక్వెల్‌. ఇదే చిత్రాన్ని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ ,మీనా జంట‌గా రీమేక్ చేశారు. ఈ మూవీ కూడా ఓటీటీలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్ లోనూ రీమేక్ చేస్తున్నారు. 2016లో మ‌ల‌యాళ - తెలుగు - త‌మిళ భాష‌ల్లో రీమేక్ అయి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `దృశ్యం` చిత్రాన్ని రీమేక్ చేసిన అజ‌య్ దేవ‌గ‌న్ మ‌ళ్లీ దానికి సీక్వెల్ గా వ‌చ్చిన `దృశ్యం -2` ని కూడా రీమేక్ చేస్తున్నారు. `దృశ్యం` రీమేక్ లో న‌టించిన శ్రియ ఇందులోనూ న‌టిస్తోంది. ఉత్కంఠ భ‌రితంగా సాగే క‌థా క‌థ‌నాల‌తో సాగే ఈ చిత్రాన్ని గురువారం ముంబైలో హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ప్రారంభించారు.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా ఆన్ లొకేష‌న్ కి సంబంధించిన ఓ ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో అజ‌య్ దేవ‌గ‌న్ విజ‌య్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఆన్ లొకేష‌న్ ఫొటోకి ఆస‌క్తిక‌ర‌మైన ఓ పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `విజ‌య్ మ‌రోసారి త‌న ఫ్యామిలీని ర‌క్షించుకుంటాడా? ` అంటూ ఈ మూవీ షూటింగ్ మొద‌లైంద‌ని తెలియ‌జేశారు. అభిషేక్ పాథ‌క్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో టాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌రు.

`దృశ్యం` చిత్రాన్ని నిశికాంత్ కామ‌త్ కూపొందించారు. అయితే గ‌తేడాది ఆయ‌న మృతి చెంద‌డంతో `దృశ్యం -2` బాధ్య‌త‌ల్ని అభిషేక్ పాథ‌క్ కి అప్ప‌గించారు. గురువారం ప‌ట్టాలెక్కిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మ‌ల‌యాళ‌, తెలుగు భాష‌ల్లో సూప‌ర్ హిట్ గా నిలిచిన‌ట్టే బాలీవుడ్ లోనూ బంప‌ర్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్పిందే.