Begin typing your search above and press return to search.

దిల్ రాజు మ‌ళ్లీ ఫ్యాన్స్ ని కెలికేశాడుగా!

By:  Tupaki Desk   |   26 Dec 2022 6:01 AM GMT
దిల్ రాజు మ‌ళ్లీ ఫ్యాన్స్ ని కెలికేశాడుగా!
X
దిల్ రాజు.. గ‌త కొన్ని రోజులుగా త‌మిళ‌, తెలుగు ఇండ‌స్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారుతున్న పేరిది. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు అదే క్రేజ్ ని అన్ని భాష‌ల్లోనూ ద‌క్కించుకోవాల‌ని, స్టార్ ప్రొడ్యూస‌ర్ గా ఇండియావైడ్‌గా గుర్తింపుని ద‌క్కించుకోవాల‌ని కొత్త‌గా అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ లో ప్ర‌వేశించి ఇప్ప‌టికే చేతులు కాల్చుకున్న దిల్ రాజు ప్ర‌స్తుతం త‌మిళ‌నాట తొలి సారి అడుగుపెడుతూ నిర్మాత‌గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు.

టాలీవుడ్ లో ఇప్ప‌టికే ప‌లువురు క్రేజీ స్టార్ల‌తో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఇత‌ర భాష‌ల్లోనూ అదే స్థాయిలో ప‌లువురు క్రేజీ స్టార్ల‌తో సినిమాలు చేయ‌బోతున్నాడు. ఇందులో భాగంగానే తమిళ స్టార్ హీరో విజ‌య్ తో 'వారీసు' మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని త‌మిళంలో 'వారీసు'గా తెలుగులో 'వార‌సుడు'గా రిలీజ్ చేయ‌బోతున్నారు. రెండు భాష‌ల్లోనూ ఈ మూవీ సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీతో పాటు దిల్ రాజు కూడా వ‌రుస వివాదాల‌తో ట్రెండ్ అవుతున్నాడు. ఈ మూవీ కోసం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ని బ్లాక్ చేశాడంటూ దిల్ రాజుపై టాలీవుడ్ లో వివాదం త‌లెత్తిన విష‌యం తెలిసిందే.

ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారిన చ‌ర్చ‌కు తెర‌లేపిన నేప‌థ్యంలో దిల్ రాజు చేసి వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట దుమారం రేపాయి. విజ‌య్ త‌మిళ‌నాడులో నెం.1 స్టార్ అని అత‌ని సినిమాకే అత్య‌ధికంగా థియేట‌ర్లు కేటాయించాల‌ని చేసిన వ్యాఖ్య‌లు అజిత్ ఫ్యాన్స్ కి ఆగ్రహాన్ని తెప్పించాయి.

టాలీవుడ్లో చాలామంది అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇప్పుడు కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రమే.. వారిసు/వారసుడు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా దిల్ రాజు చేసిన ఒక కామెంట్ దుమారం రేపింది.

ఈ వ్యాఖ్య‌ల‌తో విజ‌య్ ఫ్యాన్స్ దిల్ రాజుపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ట‌. ఇదిలా వుంటే 'వారీసు' ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మంలో దిల్ రాజు మ‌ళ్లీ అజిత్ ఫ్యాన్స్ ని కెల‌క‌డం ఇప్పుడు మ‌రింత ర‌చ్చగా మారిన‌ట్టు తెలుస్తోంది. చెన్నైలో'వారీసు' ఆడియో ఫంక్ష‌న్ సాక్షిగా ఈ సంక్రాంతి మాదే అంటూ దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ అజిత్ ఫ్యాన్స్ ని మ‌రింత ఇరిటేట్ చేస్తోంద‌ట‌. దీంతో దిల్ రాజుని నెట్టింట టార్గెట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.