Begin typing your search above and press return to search.

అతి పెద్ద స్క్రీన్‌ పై అలవైకుంఠపురంలో..!

By:  Tupaki Desk   |   11 Dec 2019 7:26 AM GMT
అతి పెద్ద స్క్రీన్‌ పై అలవైకుంఠపురంలో..!
X
అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో రూపొందిన 'అల వైకుంఠపురంలో' సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంతో వీరిద్దరు హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. జులాయి మరియు సన్నాఫ్‌ సత్యమూర్తిలను మించి ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను మెగా ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. బన్నీ కి కూడా ఈ సినిమా సక్సెస్‌ చాలా అవసరం. అందుకే ఈ సినిమా పబ్లిసిటీ కోసం చాలా ప్రత్యేకం గా పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఓవర్సీస్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ చిత్రంను ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌ గా రికార్డు దక్కించుకున్న ఐమాక్స్‌ మెల్‌ బోర్న్‌ స్క్రీన్‌ లో ప్రదర్శించేందుకు సిద్దం అయ్యారట. జనవరి 12 ఉదయం 7.30 గంటలకు ఈ చిత్రంను అతిపెద్ద ఐమాక్స్‌ స్క్రీన్‌ పై ప్రదర్శించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు భాషలోనే ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌ తో ఈ సినిమాను ఆ స్క్రీన్‌ లో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇప్పటి వరకు అతికొద్ది ఇండియన్‌ సినిమాలు మాత్రమే ఈ పెద్ద స్క్రీన్‌ పై ప్రదర్శితం అయ్యాయి. వాటి జాబితాలో అల వైకుంఠపురంలో కూడా చోటు దక్కించుకుంది.

అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీ లుక్‌ చాలా విభిన్నంగా ఉంది. ఇప్పటి వరకు బన్నీ పాత్ర ఏంటీ.. స్టోరీ లైన్‌ ఏంటీ అనే విషయాలపై త్రివిక్రమ్‌ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో కీలక పాత్రను టబు పోషించడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇక బన్నీకి జోడీగా ఈ చిత్రంలో ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమా పై అంచనాలు పెంచేశాయి. నేడు టీజర్‌ విడుదల కాబోతుంది. టీజర్‌ విడుదల తర్వాత సినిమాకు మరింత క్రేజ్‌ రావడం కన్ఫర్మ్‌ అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.