Begin typing your search above and press return to search.

ఇద్దరు దర్శకుల్ని లైన్ లో పెట్టిన బన్ని

By:  Tupaki Desk   |   24 Sep 2017 4:56 AM GMT
ఇద్దరు దర్శకుల్ని లైన్ లో పెట్టిన బన్ని
X
దువ్వాడ జగన్నాథం కి వచ్చిన ఫ్లాప్ టాక్ తో అల్లు అర్జున్ బాగా ఎలెర్ట్ అయిపోయాడని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. చాలా కథలు విన్నాకే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా స్టోరీకి బన్నీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట, ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన తదుపరి సినిమాలకు సంబంధించిన కథల్ని కూడా ఫైనలైజ్ చేసే పనిలో బన్నీ ఉన్నట్లుగా తెలిసింది. ఎక్కువ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగా అభిమానుల్ని అలరించేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అందుకోసం ఇటీవలే టైగర్ - ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలతో డీసెంట్ హిట్స్ కొట్టిన విఐ ఆనంద్ డైరెక్షన్ లో నటించేందుకు బన్నీ తాజాగా అంగీకరించాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ ని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి బన్నీ సినిమాను స్టార్ట్ చేసేందుకు విఐ ఆనంద్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీంతో పాటు ఓ తమిళ దర్శకుడు చెప్పిన స్టోరీకి కూడా బన్నీ ఓకే చెప్పాడట. కానీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా - విఐ ఆనంద్ తో కమిటైన సినిమాలు కంప్లీట్ అయ్యాకే ఆ తరువాత ప్రాజెక్ట్ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బన్నీ చేస్తున్న హంగామా ప్రేక్షకుల్ని ఏ రీతిన అలరిస్తుందో చూడాలి!