Begin typing your search above and press return to search.
మృతులకు బన్నీ తనవంతు సాయం
By: Tupaki Desk | 2 Sept 2020 6:30 PM ISTపవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు భారీ వేడుకలు ప్లాన్ చేశారు. ఆ వేడుకల్లో భాగంగా చిత్తూర జిల్లా శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో భారీ ప్లెక్సీలు కడుతున్న సమయంలో విధ్యత్ ఘాతుకానికి గురై ముగ్గరు మృతి చెందిన విషయం తెల్సిందే. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకు అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చాడు. ఇదే సమయంలో మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ ఆర్థిక సాయంను ప్రకటించాడు. బన్నీ కూడా తనవంతు సాయం అన్నట్లుగా అభిమానులకు సాయంకు ముందుకు వచ్చాడు.
ఘటనపై దిగ్ర్బాంతిని వ్యక్తం చేసిన అల్లు అర్జున్ మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇక వకీల్ సాబ్ చిత్ర యూనిట్ సభ్యలు మరియు మరికొందరు మెగా ఫ్యామిలీ సన్నిహితులు కూడా బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. చనిపోయిన వారిని ఎలాగూ తీసుకు రాలేం. కాని వారి కుటుంబాలకు అండగా నిలబడటం నిజంగా అభినందనీయం అంటూ అభిమానులు మెగా హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఘటనపై దిగ్ర్బాంతిని వ్యక్తం చేసిన అల్లు అర్జున్ మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇక వకీల్ సాబ్ చిత్ర యూనిట్ సభ్యలు మరియు మరికొందరు మెగా ఫ్యామిలీ సన్నిహితులు కూడా బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. చనిపోయిన వారిని ఎలాగూ తీసుకు రాలేం. కాని వారి కుటుంబాలకు అండగా నిలబడటం నిజంగా అభినందనీయం అంటూ అభిమానులు మెగా హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.