Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురూ.. చేతుల్లోకి తీసుకున్నారు..

By:  Tupaki Desk   |   13 Feb 2018 7:27 AM GMT
ఆ ముగ్గురూ.. చేతుల్లోకి తీసుకున్నారు..
X
సినిమా తీయడం దర్శకుడి పని.. చేయడం నటీనటుల పని.. నిర్మించడం నిర్మాత పని. ఇలా 24 క్రాఫ్ట్స్ లో ఎవరి పనులు వారికి ఉంటాయి. ప్రమోషన్స్ విషయంలో ఎక్కువగా ప్లానింగ్ అంతా దర్శక నిర్మాతలే చూసుకోవడం ఆనవాయితీ. వారి వ్యూహాలకు సపోర్ట్ చేయడం హీరో హీరోయిన్ల బాధ్యత. కానీ మారుతున్న కాలంతో పాటు స్ట్రాటజీలు మారిపోతున్నాయి.

ఇప్పుడు హీరోలే ఆయా సినిమాల ప్రచార వ్యూహాలను చేతుల్లోకి తీసేసుకుంటున్నారు. రీసెంట్ గా రంగస్థలం ప్రమోషన్ విషయంలో.. దర్శకుడి ఆలోచన వేరని.. ముందుగా కట్ చేసిన టీజర్ వేరే అని అంటున్నారు. చరణ్ సూచనల మేరకే క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ టీజర్స్ ను వదులుతున్నారట. ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ చెర్రీ అండ్ టీం గైడెన్స్ లోనే జరగనున్నాయని టాక్. ఇలా ఓ సినిమాను గుప్పిట పెట్టేసుకోవడం అంటే.. ఆ చిత్రం జయాపజయాలకు బాధ్యత తీసుకునేందుకు సిద్ధపడడమే.

రామ్ చరణ్ మాత్రమే కాదు.. మహేష్ బాబు.. అల్లు అర్జున్ కూడా ఆయా సినిమాలకు సంబంధించిన ప్లానింగ్ అంతా చేసుకుంటారు. కొత్తగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సరిగ్గా భరత్ అనే నేను ప్రమోషన్ స్టార్ట్ చేసేందుకు కొంత ముందుగా.. ఇన్ స్టాగ్రామ్ లో చేరి హడావిడి చేస్తున్నాడు మహేష్ బాబు. మాగ్జిమ్ మ్యాగజైన్ కు ఫోటో షూట్ తో పాటు మరికొన్నింటిలో అల్లు అర్జున్ హంగామా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా ప్రచారం కోసం హీరోలు ఎంచుకుంటున్న మార్గాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటున్నాయి. అయితే ఈ ముగ్గురూ త్వరలో ఎలాంటి హిట్స్ కొడతారో చూడాలి.