Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 27.. ముక్కోణపు కొట్లాటే

By:  Tupaki Desk   |   12 Feb 2018 5:56 AM GMT
ఏప్రిల్ 27.. ముక్కోణపు కొట్లాటే
X
ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు మొదటి వారంలోనే అనుకున్న కలెక్షన్స్ ని రాబట్టడం చాలా కామన్ అని అందరికి తెలిసిన విషయమే. దీంతో దరిదాపుల్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందని ఆలోచించి వారి సినిమాలను రిలీజ్ చేసుకుంటారు. కానీ వచ్చే సమ్మర్ లో ముగ్గురు టాప్ హీరోలు తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కి గురిచేస్తోంది. ఏ మాత్రం ఆలోచించకుండా ముగ్గురు స్టార్స్ బాక్స్ ఆఫీస్ యుద్ధానికి దిగారు. వారు ఎవరో కాదు. రజినీకాంత్ - అల్లు అర్జున్ - మహేష్.

ఈ ముగ్గురు హీరోల సినిమాల రిలీజ్ డేట్ లపై గత కొంత కాలంగా అనేక వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రజినీకాంత్ కాలా డేట్ ఎప్పుడైతే ప్రకటించాడో అప్పుడే భరత్ అనే నేను - నా పేరు సూర్య సినిమాల నిర్మాతలు కూడా రిలీజ్ డేట్ లపై ఫైనల్ నిర్ణయాన్ని తీసేసుకున్నారు. కాలా వచ్చే ఏప్రిల్ 27నే వారిద్దరు కూడా రాబోతున్నట్లు తేలిపోయింది. అయితే ముందు నుంచి భరత్ అనే నేను చిత్ర యూనిట్ ఏప్రిల్ 27అని చెప్పుకుంటూ వస్తోంది. అదే తరహాలో నా పేరు సూర్య నిర్మాత కూడా షూటింగ్ మొదట్లోనే ఆ డేట్ కి రాబోతున్నట్లు చెప్పేశాడు. అయితే వీరి మధ్యలోకి ఇప్పుడు సడన్ గా రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చాడు.

మొదట2.0 తో భయపెట్టి ఫైనల్ గా కాలాతో షాక్ ఇచ్చాడు. అదే డేటును లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. కోలీవుడ్ లో అయితే ఆ టైమ్ లో ఏ సినిమా రజినీతో పోటీ పడటానికి సాహసం చేయడం లేదు. కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి కూడా. కానీ మన హీరోలు మాత్రం తగ్గేది లేదు అంటున్నారు. బన్నీ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ ఇంపాక్ట్ కి అందరు ఫిదా అయ్యారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సరికొత్తగా సీఎం పాత్రలో కనిపించడానికి రెడీ అవుతుండడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. అందులోనూ కొరటాల తెరకెక్కిస్తుండడం చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం పక్కా అనిపిస్తోంది. మరి ఈ స్ట్రాంగ్ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి.