Begin typing your search above and press return to search.

శిరీష్ అప్సెట్ అయ్యాడా?

By:  Tupaki Desk   |   22 Feb 2018 4:27 AM GMT
శిరీష్ అప్సెట్ అయ్యాడా?
X
టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అందరు హీరోలు మినిమామ్ హిట్స్ అందుకున్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఇంకా ఒక భారీ హిట్ కోసమని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ సెట్ అవ్వట్లేదు అని మలయాళం లో కూడా మనోడు అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అన్న ఇమేజ్ అక్కడ తమ్ముడికి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. అయితే గత ఏడాది మలయాళంలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన 1971: బియోన్డ్ బార్డర్స్ సినిమాలో శిరీష్ నటించాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించరు.

అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మాజీ సైనికదికారి మేజర్ రవి ఆ సినిమాను తెరకెక్కించాడు. ఇకపోతే తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేయాలని ఆ సినిమా తెరకెక్కుతోన్న సమయంలోనే ప్రముఖ నిర్మాత ఎన్వీ. ప్రసాద్ ప్లాన్ వేసుకున్నారు. కానీ సినిమా రిజల్ట్ తరువాత ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తక్కువ ఎమౌంట్ కి వేరే వాళ్లకి అమ్మేసినట్లు తెలుస్తోంది. తెలుగు డబ్బింగ్ హక్కులు ఒక 15 లక్షలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయం శిరీష్ కు అస్సలు తెలియదట.

కనీసం ఎలాంటి విషయాన్ని చెప్పకుండా సినిమాను అలా రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని శిరీష్ అప్సెట్ అయ్యాడట. సీనియర్ ప్రొడ్యూసర్ ఈ తరహాలో వ్యవహరిస్తాడని అనుకోలేదని శిరీష్ అనుకుంటున్నాడట. ఫోన్లో వారిద్దరికీ కొన్ని సంభాషణలు జరిగాయని శిరీష్ ఆ కారణంగా కోప్పడ్డట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఆ విషయాలు ఎంతవరకు నిజమో తెలియదు గాని రీసెంట్ గా ఆ సినిమా తెలుగు టీజర్ ను యుద్ధభూమి అనే నేమ్ తో రిలీజ్ చేశారు.