Begin typing your search above and press return to search.

దిల్ రాజు బాట‌లో మ‌రో క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ!

By:  Tupaki Desk   |   16 July 2022 2:30 AM GMT
దిల్ రాజు బాట‌లో మ‌రో క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ!
X
గ‌త కొన్ని నెల‌లుగా బాలీవుడ్ ని ద‌క్షిణాది శాసిస్తోంది. త‌న‌దైన మార్కు సినిమాల‌తో ఓ రేంజ్ లో వ‌ణికిస్తోంది. ఈ మ‌ధ్య బాలీవుడ్ సినిమాల‌కు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ క‌రువ‌వ్వ‌డం.. అదే స‌మ‌యంలో మ‌న ద‌క్షిణాది చిత్రాల‌కు అక్క‌డి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో మ‌న సినిమాల కోసం అక్క‌డి నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. భారీ స్థాయిలో రైట్స్ ని సొంతం చేసుకోవ‌డానికి, డ‌బ్బింగ్ హ‌క్కుల్ని ద‌క్కించుకోవ‌డానికి ముందు కొస్తున్నారు.

ఇదిలా వుంటే ద‌క్షిణాది నుంచి బాలీవుడ్ బాట ప‌డుతున్న నిర్మాత‌ల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీల‌తో పాటు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కూడా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లు నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల 'జెర్సీ' రీమేక్ తో బాలీవుడ్ బాట ప‌ట్టిన ఆయ‌న ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించ‌గా విశ్వ‌క్ సేన్ న‌టించిన 'హిట్ ద ఫ‌స్ట్ కేస్‌' మూవీని అదే పేరుతో టిసిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ తో క‌లిసి రీమేక్ చేస్తున్నారు.

రాజ్ కుమార్ రావు, 'దంగ‌ల్' సాన్యా మ‌ల్హోత్రా జంట‌గా న‌టిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా జూలై 15న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దీని త‌రువాత 'ఎఫ్ 2' నికూడా రీమేక్ చేయ‌డానికి రెడీ అవుతుంటే ద‌క్షిణాదికి చెందిన పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ లైకా ప్రొడ‌క్ష‌న్స్ జాన్వీ క‌పూర్ సినిమాతో బాలీవుడ్ బాట‌ప‌డుతోంది. జాన్వీ క‌పూర్ న‌టిస్తున్న తాజా చిత్రం 'గుడ్ ల‌క్ జెర్రీ'. సిద్ధార్ధ్ సేన్ గుప్త ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌య‌న‌తార న‌టించిన త‌మిళ చిత్రం 'కొల‌మావు కోకిల‌' ఆధారంగా ఈ సినిమాని బీహార్‌ నేప‌థ్యంలో రూపొందించారు.

క్రైమ్ కామెడీగా తెర‌కెక్కిన ఈ మూవీకి ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్ ని శుక్ర‌వారం విడుద‌ల చేశారు. జాన్వీ జ‌యా పాత్ర‌లో న‌టించింది. ట్రైల‌ర్ చూసిన వాళ్లంతా త‌న న‌ట‌న‌కు ఫిదా అయిపోతున్నారు.

త‌న త‌ల్లిని కాపాడుకోవాల‌న్న ఆలోచ‌న‌తో జ‌య‌కుమారి అనే యువ‌తి డ‌బ్బుల కోసం డ్ర‌గ్స్ గ్యాంగ్ తో చేతులు క‌లుపుతుంది. ,జెర్రీగా మారుతుంది. పోలీసుల క‌ళ్లుగ‌ప్పి జెర్రీ ఎలా డ్ర‌గ్స్ సేల్ చేసింది? ఆ క్ర‌మంలో ఎలాంటి ప‌రిణామాల్ని ఎదుర్కొంది? చివ‌రికి డ్రగ్స్ ముఠాకు ఎలా చుక్క‌లు చూపించింద‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ మూవీని రూపొందించారు.

క్రైమ్ కామెడీ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా వుండ‌టంతో ఈ మూవీతో లైకా బాలీవుడ్ లో బోణీ కొట్టడం ఖాయం అని అంటున్నాయి కోలీవుడ్ వ‌ర్గాలు.