Begin typing your search above and press return to search.

ఆ మల్టీస్టారర్ రీమేక్ చేసే డైరెక్టర్ కన్ఫర్మ్ అంట!

By:  Tupaki Desk   |   12 Jun 2020 8:10 AM GMT
ఆ మల్టీస్టారర్ రీమేక్ చేసే డైరెక్టర్ కన్ఫర్మ్ అంట!
X
టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ కొన్ని హిట్లు.. కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఈ రెండూ కలిసి ఉన్న సినిమా చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు. మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాను రీమేక్ చేయడం కోసం నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యింది.

అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానాని ఓకే చేశారు. అయితే బిజూ మీనన్ పాత్రకోసం రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే విషయం ఇంకా తేలలేదు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి తీసుకొస్తే సినిమా చేయడానికి సిద్ధమని వారు ప్రకటించారట. మరి సమర్ధవంతంగా ఆ మలయాళ సినిమాకు మార్పులు చేయగల దర్శకుడు ఎవరు.. అని వేటలో ఉంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. అయితే డైరెక్టర్ సుధీర్ వర్మ పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తోంది. స్వామిరారా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుధీర్ వర్మ ఆ తర్వాత సరైన విజయాన్ని అందుకోలేదు. మరి ఈ సినిమా పక్కా అయితే మరి డైరెక్టర్ గా సుధీర్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.