Begin typing your search above and press return to search.

బాలకృష్ణ ఆ రీమేక్‌ కు నో చెప్పేసినట్లేనా?

By:  Tupaki Desk   |   11 Jun 2020 7:10 AM GMT
బాలకృష్ణ ఆ రీమేక్‌ కు నో చెప్పేసినట్లేనా?
X
మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన అయ్యప్పన్‌ కోషియుమ్‌ చిత్రంను తెలుగులో రీమేక్‌ చేసేందుకు సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ వారు భారీ మొత్తం పెట్టి రైట్స్‌ ను కొనుగోలు చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ ఈ రీమేక్‌ పై ఆసక్తి ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. బాలకృష్ణ ఇప్పటికే స్టోరీ కూడా విన్నాడని అన్నారు. కాని తాజాగా బాలకృష్ణ ఆ రీమేక్‌ ను చేయడం లేదని క్లారిటీ వచ్చేసింది.

తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతానికి బోయపాటి మూవీ మినహా మరే సినిమాకు ఓకే చెప్పలేదని రీమేక్‌ సినిమా విషయంపై ఎలాంటి చర్చలు జరగలేదు అన్నాడు. అంటే ఆ రీమేక్‌ లో బాలయ్య లేనట్లే కదా అంటున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాకు గాను పలువురు హీరోలతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ రీమేక్‌ బాధ్యతలను ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ కు అప్పగించే విషయమై కూడా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పవన్‌ కళ్యాణ్‌ తో ఒక సినిమాను హరీష్‌ శంకర్‌ చేయబోతున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ రీమేక్‌ ను చేస్తాడట. అంటే వచ్చే ఏడాది చివరి వరకు ఈ రీమేక్‌ పట్టాలెక్కే అవకాశం లేదని అంటున్నారు. గద్దల కొండ గణేష్‌ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరికి నచ్చింది అందుకే ఈ రీమేక్‌ బాధ్యతలను కూడా ఆయనకే ఇస్తే న్యాయం చేస్తాడని సితార వాళ్లు భావిస్తున్నారట. త్వరలోనే ఈ రీమేక్‌ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.