Begin typing your search above and press return to search.

అల్లు వారి క్యాంప్ లో ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   28 Oct 2022 2:30 AM GMT
అల్లు వారి క్యాంప్ లో ఏం జ‌రుగుతోంది?
X
టాలీవుడ్ లో వార‌సుల ఫ్యామిలీల్లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మ‌ధ్య వున్న అనుబంధం గురించి తెలిసిందే. అయితే గ‌త కొంత కాలంగా ఈ ఫ్యామిలీల మ‌ధ్య దూరం పెరుగుతోందంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించ‌డం మొద‌లైంది. ఈ వార్త‌ల‌పై అటు మెగా ఫ్యామిలీ కానీ, అల్లు ఫ్యామిలీ కానీ వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఆ వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని కొట్టిపారేయ‌లేదు. ఇటీవ‌ల ఆలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన టాక్ షోలో ప్ర‌త్యేకంగా పాల్గొన్న అల్లు అర‌వింద్ మాత్రం ఈ వార్త‌ల‌పై స్పందించారు.

అందులో ఎలాంటి నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ప్ర‌తీ పండ‌క్కి ఇరు కుటుంబాల వాళ్లం ప్ర‌త్యేకంగా క‌లుస్తుంటామ‌ని, ఆ విష‌యాన్నిప్ర‌తీసారి వెల్ల‌డించ‌లేం క‌దా? .. మా రెండు ఫ్యామిలీలు ఎదుగుతున్నాయి. పిల్ల‌లు ప్ర‌యోజ‌కులు అవుతున్నారు.. ఎవ‌రికి న‌చ్చింది వారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇలాంటి వార్త‌లు పుట్టుకొస్తున్నాయి అంటూ వివ‌రించారు.

ఇదిలా వుంటే అల్లు వారి ఫ్యామిలీకి నంద‌మూరి ఫ్యామిలీకి మ‌ధ్య రోజు రోజుకూ దూరం త‌గ్గిపోతోంది. మ‌రీ ముఖ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ విష‌యంలో అల్లు ఫ్యామిలీ తీరు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇండ‌స్ట్రీలో నంద‌మూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మ‌ధ్య వృత్తి ప‌ర‌మైన పోటీ గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా న‌డుస్తోంది. అయితే అదే ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహిత‌మైన అల్లు ఫ్యామిలీ మాత్రం నంద‌మూరి బాల‌య్య‌కు అత్యంత చేరువ‌గా అడుగులు వేస్తోంది.

మెగా క్యాంప్ లో భాగం అయిన అల్లు ఫ్యామిలీ మునుపెన్న‌డూ లేని విధంగా నంద‌మూరి బాల‌య్య‌తో స‌న్నిహితంగా మెగ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది. నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి అల్లు వారు భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఆహా` ఓటీటీ కోసం `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` పేరుతో టాక్ షోలో పాల్గొన‌డం.. అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో అల్లు వారితో బాల‌య్య బంధం బ‌ల‌ప‌డింది. తాజాగా చేసిన సీజ‌న్ 2 కూడా హిట్ అనిపించుకోవ‌డంతో వీరి మ‌ధ్య దూరంగా శాశ్వ‌తంగా త‌గ్గిపోయి ఒక‌రి ఫంక్ష‌న్ ల‌కు ఒక‌రు వ‌చ్చే వ‌ర‌కు వెళ్ల‌డం విశేషం.

అల్లు శిరీష్ న‌టించిన `ఊర్వ‌శీవో రాక్ష‌సివో` న‌వంబ‌ర్ 4న రిలీజ్ కాబోతోంది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 30న నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ ఈవెంట్ కి నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` ఫంక్ష‌న్ కు అల్లు అర్జున్ హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. రానున్న రోజుల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌స్తే అల్లు అర‌వింద్ కి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ఖాయం అని అంటున్నారు. కానీ ఈ స‌మీక‌ర‌ణాలు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పెద్ద‌గా రుచించ‌డం లేద‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.