Begin typing your search above and press return to search.

బాలయ్య 'ఆహా' షో.. క్రిష్‌ ప్రశాంత్ వర్మల్లో ఎవరు?

By:  Tupaki Desk   |   11 Oct 2021 5:33 AM GMT
బాలయ్య ఆహా షో.. క్రిష్‌ ప్రశాంత్ వర్మల్లో ఎవరు?
X
నందమూరి బాలకృష్ణ ఆహా కోసం టాక్ షో చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన సమయంలో అంతా కూడా ఆశ్చర్యపోయారు. ఇవి ఖచ్చితంగా పుకార్లే అయ్యి ఉంటాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆహా వారి నుండి అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ వచ్చింది. బాలయ్య తో టాక్‌ షో లకే బాప్ వంటి టాక్ షో ను చేయబోతున్నాం... పైసా వసూల్‌ పక్కా అంటూ చాలా నమ్మకంతో చెబుతున్నారు. ఆహా నుండి వచ్చిన ప్రకటనతో జనాల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఆహా ఓహో అంటూ ఆహా ఓటీటీపై అంతా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. బాలయ్య వంటి స్టార్‌ ను టాక్‌ షో కు ఒప్పించడం అంటే ఖచ్చితంగా అదే పెద్ద సక్సెస్‌. కనుక తదుపరి విషయంపై పెద్దగా చర్చ కూడా అక్కర్లేదు అంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ టాక్‌ షో నడువబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే బాలయ్య పై ప్రోమోలను కూడా షూట్ చేశారనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆహా టాక్ షో కోసం ప్రోమోను షూట్‌ చేయబోతున్నారట. ప్రశాంత్‌ వర్మ కమర్షియల్స్‌ మరియు ఇలాంటి షో లకు సంబంధించిన ప్రోమోలను షూట్‌ చేయడం లో ఆయనకు ఆయనే సాటి అన్నట్లుగా పేరును దక్కించుకున్నాడు. ఆమద్య బిగ్‌ బాస్ ప్రోమోకు కూడా మంచి పేరును ఆయన దక్కించుకున్నాడు. అందుకే ఆహా వారు బాలయ్య టాక్ షో కు గాను ప్రోమోను ఆయనతో చేయించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రోమో విషయంలో బాధ్యతను ప్రశాంత్‌ వర్మకు ఇచ్చినా కూడా అసలు షో ను మాత్రం క్రిష్ దర్శకత్వంలోనే చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది.

ఇప్పటికే ప్రోమోలు చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి.. ఆ సమయంలో బాలయ్య కాలికి చిన్న గాయం అయ్యిందని.. గాయం అయినా కూడా లక్ష్య పెట్టకుండా బాలయ్య షూట్‌ లో పాల్గొన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. క్రిష్‌ చాలా విభిన్నమైన ప్రోమోను బాలయ్య పై చిత్రీకరించాడని వార్తలు రావడం.. ఇప్పుడు ఆహా షో కోసం ప్రశాంత్‌ వర్మ ప్రోమోలు చిత్రీకరించబోతున్నాడు అంటూ వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరిలో బాలయ్య ఆహా టాక్ షో అన్‌ స్టాపబుల్‌ కు ప్రోమోలు చిత్రీకరిస్తున్నది ఎవరు అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య అఖండ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో బాలయ్య తదుపరి సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. అది వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కనుందని సమాచారం అందుతోంది.