Begin typing your search above and press return to search.

ఆ బయోపిక్‌ బెల్లంకొండ వద్దకు వచ్చి ఆగిందా?

By:  Tupaki Desk   |   21 Dec 2018 7:27 AM GMT
ఆ బయోపిక్‌ బెల్లంకొండ వద్దకు వచ్చి ఆగిందా?
X
ఈ మద్య కాలంలో టాలీవుడ్‌ లో వరుసగా బయోపిక్‌ లు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్‌ లు రూపొందుతున్నాయి. ఇప్పటికే మహానటి బయోపిక్‌ వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహం తో మరిన్ని బయోపిక్‌ లు వస్తున్నాయి. ఈ నేపత్యంలోనే ఇండియన్‌ రాబిన్‌ హుడ్‌ గా పేరు దక్కించుకున్న టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌ కూడా తెరకెక్కబోతుంది అంటూ చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అప్పట్లో టైగర్‌ నాగేశ్వరరావు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. ఆయన దోపిడీలు, దొంగతనాలు చేస్తూ వచ్చారు. ఆయన గురించి రకరకాలుగా చెప్పుకునే వారు. అలాంటి వ్యక్తి బయోపిక్‌ ను తీయడం కోసం పలువురు ప్రయత్నించారు. కాని ఏ ఒక్కరు కూడా ఆ బయోపిక్‌ ను తెరపైకి తీసుకు రాలేక పోయారు. ఇక గత కొన్ని రోజులుగా నాని- రానా- నాగచైతన్య వంటి హీరోల పేర్లు ఈ బయోపిక్‌ కు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. రానా ఫిక్స్‌ అయినట్లుగానే మీడియా లో వార్తలు వచ్చాయి. చివరకు ఈ ప్రాజెక్ట్‌ బెల్లంకొండ వద్దకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది.

‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీ కృష్ణ ఈ బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట. బెల్లంకొండ శ్రీనివాస్‌ ను తాజాగా ఆయన సంప్రదించాడని, చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కాని, బెల్లంకొండ మాత్రం టైగర్‌ నాగేశ్వర రావు పాత్ర ను చేసేందుకు చాలా ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.