Begin typing your search above and press return to search.

లారెన్స్ దెబ్బ నుంచి ఇన్నాళ్లకు కోలుకున్నారు

By:  Tupaki Desk   |   6 July 2016 3:30 PM GMT
లారెన్స్ దెబ్బ నుంచి ఇన్నాళ్లకు కోలుకున్నారు
X
భగవాన్.. పుల్లారావు.. డీవీవీ దానయ్య.. ఈ ముగ్గురూ కలిసి ఒకప్పుడు ‘బాలాజీ ఆర్ట్స్’ బేనర్ మీద తెలుగులో వరుసగా సినిమాలు చేశారు. ఈ ముగ్గురిలోంచి దానయ్య బయటికి వచ్చేసి యూనివర్శల్ మీడియా పేరుతో వేరే బ్యానర్ పెట్టుకున్నాడు. భగవాన్-పుల్లారావు కలిసి అదే బేనర్ మీద సినిమాలు కొనసాగించారు. ఐతే నాలుగేళ్ల కిందట వీళ్లిద్దరూ కలిసి లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రెబల్’ అనే సినిమా తీశారు.

ముందుగా అనుకున్న దానికంటే బడ్జెట్ బాగా పెంచేసి.. ప్రభాస్ మార్కెట్ స్థాయికి మించి భారీగా ఖర్చు పెట్టించేసి సినిమా పూర్తి చేశాడు లారెన్స్. తీరా చూస్తే సినిమా డిజాస్టర్ అయింది. నిర్మాతలు నిండా మునిగారు. లారెన్స్ చేసిన నిర్వాకానికి అతడి మీద కేసు కూడా పెట్టారు. దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఈ ఒక్క సినిమా కొట్టిన దెబ్బకు నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీకే దూరమైపోయారు భగవాన్-పుల్లారావు.

ఐతే ఈ జంట నిర్మాతలు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘బెంగాల్ టైగర్’తో మోడరేట్ సక్సెస్‌ ను ఖాతాలో వేసుకున్న సంపత్.. కొంచెం గ్యాప్ తీసుకుని గోపీచంద్ కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ రెడీ చేశాడు. ఇందులో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించే అవకాశముంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలవుతుంది.