Begin typing your search above and press return to search.

చిక్కుల్లో టాలీవుడ్ హీరోయిన్.. బీజేపీ విమర్శలు

By:  Tupaki Desk   |   21 Oct 2022 4:00 AM GMT
చిక్కుల్లో  టాలీవుడ్ హీరోయిన్.. బీజేపీ విమర్శలు
X
ఒకప్పుడు ‘హాహా.. హాసిని’ అంటూ తెలుగు నాట అల్లరి చేసిన హీరోయిన్ తర్వాత ముంబై వెళ్లి హిందీ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. పిల్లలను కని గృహిణిగా మారింది. ఇప్పడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఆమె ఎవరో కాదు.. జెనీలియా.. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకూ అనేక భాషలలో పలు సినిమాలు చేసింది. ‘బాయ్స్’ సినిమాతో జెనీలియా ఎంట్రీ ఇచ్చింది. 2003వ సంవత్సరంలో ‘సత్యం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన జెనీలియా వరుస అవకాశఆలు అందుకుంది.

సత్యం సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘సై’ సినిమా చేసి జెనీలియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2006వ సంవత్సరంలో ‘బొమ్మరిల్లు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తెలుగు జనాలకు బాగా చేరువైంది. ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. ‘ఢీ’, రెడీ సినిమాలు జెనీలియాకు మంచి గుర్తింపును ఇచ్చాయి. నా అల్లుడు, ఆరెంజ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

సినిమా ఇండస్ట్రీలో ఫెయిడ్ అవుట్ అయ్యాక జెనీలియా అవకాశాలు తగ్గిపోవడంతో 2012వ సంవత్సరంలో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

తాజాగా జెనీలియా మరో వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్, ఆయన భార్య జెనీలియాకు చెందిన దేశ్ ఆగ్రో ప్రైవేట్ కంపెనీకి మహారాష్టర ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అక్రమంగా భూములు కేటాయించిందని బీజేపీ నేతలు ఆరోపించారు. రెండు సహకార బ్యాంకులు ఈ కంపెనీకి రూ.120 కోట్ల లోన్ అక్రమంగా మంజూరు చేశాయని విమర్శించారు. ఈ రెండు అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

జెనీలియా మామ, రితేష్ తండ్రి గతంలో మహారాస్ట్ర సీఎంగా చేశారు. వీరిది పొలిటికల్ ఫ్యామిలీ.. కాంగ్రెస్ కుటుంబం. అందుకే బీజేపీ ఈ విమర్శలు చేసినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.