Begin typing your search above and press return to search.

స‌మంత‌కు బాడీగార్డ్ గా మారిన బాలీవుడ్ హీరో

By:  Tupaki Desk   |   12 March 2022 9:34 AM GMT
స‌మంత‌కు బాడీగార్డ్ గా మారిన బాలీవుడ్ హీరో
X
ఓ సినిమా కోసం బాలీవుడ్ వెళ్లిన స్టార్ హీరోయిన్‌ స‌మంత‌కు బాలీవుడ్ క్రేజీ హీరో వ‌రుణ్ ధావ‌న్ బాడీగార్డ్ గా మార‌డం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి స‌మంత కెరీర్ విష‌యంలో దూకుడు చూపిస్తోంది. తెలుగు క్రేజీ చిత్రం 'పుష్ప‌'లో తొలి సారి బ‌న్నీతో క‌లిసి 'ఊ అంటావా మావ‌.. ఊహూ.. అంటావా..' అంటూ ప్ర‌త్యేక ఐట‌మ్ సాంగ్ లో ర‌చ్చ చేసిన సామ్ ఈ పాట‌తో నేష‌న‌ల్ వైడ్ గా వైర‌ల్ గా మారింది. మ‌ళ్లీ స‌రికొత్త జోష్ తో కెరీర్‌ని భారీగా ప్లాన్ చేసుకోవ‌డం మొద‌లుపెట్టింది.

తెలుగుతో పాటు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. తెలుగులో సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ 'య‌శోద‌'లో న‌టిస్తున్న స‌మంత అదే స్పీడుతో హిందీలోనూ ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల్లో సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టింది. 'ఫ్యామిలీమ్యాన్ -2'తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు చేరువైన సామ్ 'పుష్ప‌' ఐట‌మ్ సాంగ్ తో మ‌రింత ద‌గ్గ‌రైంది. దీంతో సామ్ కు బాలీవుడ్ లో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. వ‌రుణ్ ధావ‌న్ తో 'సిటాడెల్‌' అనే మూవీలోనూ న‌టించ‌బోతోంది.

ఈ మూవీతో పాటు త‌న‌కు 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో న‌టించే అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్స్ రాజ్ ఎన్ డీకేల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కావ‌డానికి ఇటీవ‌ల సామ్ ముంబై వెళ్లింది. అక్క‌డ ఫిలిం క్రిటిక్స్ అవార్డుల కార్య‌క్ర‌మంలో మెరిసిన స‌మంత ఆ త‌రువాత‌ డైరెక్ట‌ర్స్ రాజ్ ఎన్ డీకేల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయింది.

ఈ స‌మావేశంలో హీరో వ‌రుణ్ ధావ‌న్ కూడా పాల్గొన్నారు. స‌మావేశం అనంత‌రం అంతా బ‌య‌టికి రాగా స‌మంత‌ని బాలీవుడ్ మీడియా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసే ప్ర‌య‌త్నం చేసింది.

ఫొటో గ్రాఫ‌ర్ లు, మీడియా , అభిమానులు స‌మంత‌పై ఒక్క‌సారిగా ఎగ‌బ‌డే స‌రికి సామ్ షాక్ కు గురైంది. ఇది గ‌మ‌నించిన హీరో వ‌రుణ్ ధావ‌న్ వెంట‌నే స‌మంత‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచాడు. 'భ‌య‌పెట్ట‌రండి.. ఆమెను ఎందుకు భ‌య‌పెడుతున్నారు' అంటూ స‌మంత‌కు బాడీగార్డుగా మార‌డం అక్క‌డున్న వారిని అవాక్క‌య్యేలా చేసింది. స‌మంత‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచిన వ‌రుణ్ ధావ‌న్ ఆమెని కార్ వ‌ర‌కు తీసుకెళ్లి ఎక్కించ‌డం ప్ర‌స్తుతం నెట్టిట్లో వైర‌ల్ గా మారింది.

రాజ్ ఎన్ డీకే త్వ‌ర‌లో మ‌రో వెబ్ సిరీస్ ని చేయ‌బోతున్నారు. ఇందులో వ‌రున్ ధావ‌న్‌, స‌మంత క‌లిసి న‌టించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. 'సీటాడెల్‌'అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ తెర‌పైకి రానుంద‌ట‌. దీనికి సంబంధించిన చ‌ర్చ‌ల కోస‌మే సామ్ ఇటీవ‌ల ముంబై వెళ్లారని తెలిసింది.