Begin typing your search above and press return to search.

ఈ సౌత్‌ ఫార్ములాను కూడా కాపీ కొట్టిన బాలీవుడ్‌ సినిమా

By:  Tupaki Desk   |   4 Feb 2022 6:30 AM GMT
ఈ సౌత్‌ ఫార్ములాను కూడా కాపీ కొట్టిన బాలీవుడ్‌ సినిమా
X
ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలను చూసి సౌత్‌ సినిమా మేకర్స్ మేకింగ్‌ చేసేవారు. బాలీవుడ్‌ లో హిట్‌ సినిమా ఫార్ములాలను తీసుకుని సౌత్ లో సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే వారు. ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలను కాపీ చేయడం లేదా.. రీమేక్ చేయడం సౌత్‌ లో జరిగేది. కాని కాలం మారినట్లుగానే మొత్తం పద్ధతులు మారాయి. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలకు సౌత్‌ సినిమాలకు చాలా తేడాలు ఉండేవి.

బాలీవుడ్‌ సినిమాల మేకింగ్ కాస్ట్‌ లో కనీసం 25 శాతం కూడా సౌత్‌ సినిమా మేకింగ్‌ కాస్ట్‌ ఉండక పోయేది. కాని ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాలను మించి తెలుగు తమిళ సినిమాలకు ఖర్చు చేస్తున్నారు. శంకర్ రాజమౌళిలు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కు కొత్త పాఠాలను నేర్పుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌ ను చూసి నేర్చుకుంటే ఇప్పుడు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ మన సౌత్‌ సినిమాలను ఫాలో అవ్వడం.. కాపీ కొట్టడం చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బాలీవుడ్‌ లో ఒకప్పుడు సౌత్‌ సినిమాల రీమేక్ చాలా తక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు ఏక కాలంలో పది వరకు సౌత్‌ సినిమాల రీమేక్ లు జరుగుతున్నాయి. ముందు ముందు మరిన్ని సౌత్‌ సినిమాల రీమేక్ లు అక్కడ తెరకెక్కే అవకాశం ఉంది. అంతే కాకుండా సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు లో రూపొందుతున్న చాలా సినిమాలు డైరెక్ట్ అక్కడ డబ్‌ అయ్యి విడుదల అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్స్ గా బాలీవుడ్‌ హీరోల కంటే టాలీవుడ్‌ హీరోలకు ఎక్కువగా గుర్తింపు ఉంది.

ఇలా తెలుగు తమిళ సినిమా లు బాలీవుడ్‌ కంటే గ్రేట్‌ అన్నట్లుగా ఏడాది ఏడాదికి క్రేజ్‌ పెంచుకుంటూ పోతున్నాయి. కొత్త కొత్త ఐడియాలతో సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్ సూపర్‌ హిట్స్ ను దక్కించుకుంటున్నారు. బాహుబలి సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయడం ద్వారా భారీ లాభాలను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత కేజీఎఫ్ ఇప్పుడు పుష్ప ఇలా రెండు పార్ట్ లుగా వస్తున్న ఫార్ములా సౌత్‌ లో ఆరంభం అయ్యింది. ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇదే ఫార్ములా బాలీవుడ్‌ లో కూడా మొదలు అయ్యింది.

జాన్ అబ్రహం హీరోగా.. మన సౌత్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్ గా నటించిన 'అటాక్‌' సినిమా రెండు పార్ట్‌ లుగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సౌత్‌ సినిమా వాళ్లు చెప్పినట్లుగానే కథను ఒక్క పార్ట్‌ లో చెప్పడం కష్టంగా ఉంది అందుకే రెండు పార్ట్‌ ల్లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అటాక్‌ పార్ట్‌ 1 ను ఏప్రిల్‌ 1వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

అటాక్‌ రెండవ పార్ట్‌ ను ఎక్కువ గ్యాప్‌ ఇవ్వకుండానే కొన్ని నెలల గ్యాప్‌ లోనే విడుదల చేస్తామని అంటున్నారు. ఈ సినిమా లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా ను లక్ష్యా రాజ్ ఆనంద్‌ దర్శకత్వంలో జయంతిలాల్‌ నిర్మించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకుంది. సౌత్‌ లో ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్‌ లో బిజీ అయ్యేందుకు ఈ సినిమా ఆమెకు హెల్ప్‌ అవుతుందని ఆమె ఆశ పడుతోంది. మరి పరిస్థితులు ఆమెకు సహకరిస్తాయా అనేది చూడాలి.