Begin typing your search above and press return to search.

సెట్స్ లో బిగ్ స్టార్స్ సంద‌డికి అంతా రెడీ?

By:  Tupaki Desk   |   5 Nov 2022 2:30 AM GMT
సెట్స్ లో బిగ్ స్టార్స్ సంద‌డికి అంతా రెడీ?
X
టాలీవుడ్ లో టాప్ సీనియ‌ర్ హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తుంటే స్టార్ హీరోలు షూటింగ్ ల‌కు బ్రేకిచ్చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌న్ బై వ‌న్ స్టార్ హీరోలు సెట్స్ లో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఇటీవ‌ల 'RRR' ప్ర‌మోష‌న్స్ కోసం వైఫ్ తో క‌లిసి జ‌పాన్ వెళ్లిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అక్క‌డి ప్ర‌మోష‌న్స్ ముగించుకుని అక్క‌డి నుంచి ఆఫ్రీకా వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డి అందా మ‌ధ్య శ్రీ‌మ‌తి ఉపాస‌న‌తో క‌లిసి విహ‌రించిన రామ్ చ‌ర‌ణ్ రీసెంట్ గా హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశాడు.

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న RC 15లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల 'ఇండియ‌న్ 2' షూటింగ్ తిరిగి ప్రారంభం కావ‌డంతో శంక‌ర్ చ‌ర‌ణ్ సినిమాకు బ్రేకిచ్చి 'ఇండియ‌న్ 2' షూటింగ్ లో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నాడు. చ‌ర‌ణ్ ఆఫ్రికా వెకేష‌న్ ని పూర్తి చేసుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే RC 15 తాజా షెడ్యూల్ తో పాటు RC 16కి సంబంధించిన అప్ డేట్ రానుంద‌ని తెలుస్తోంది.

ఇక చ‌ర‌ణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా 'RRR' ప్ర‌మోష‌న్స్ కోసం వైఫ్ తో క‌లిసి జ‌పాన్ వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ప్ర‌మోష‌న్స్ పూర్త‌వ‌డంతో తిరిగి రీసెంట్ గా హైద‌రాబాద్ వ‌చ్చేశాడు. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో తానే చేయ‌బోతున్న 30వ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌, ఫార్మ‌ల్ పూజ‌పై సందిగ్ధ‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఫార్మ‌ల్ పూజ‌ని పూర్తి చేసి డిసెంబ‌ర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంద‌ని తెలుస్తోంది.

ప‌వ‌ర స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త కొన్ని రోజులుగా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో భాగంగా ఏపీలో ప‌ర్య‌టిస్తూ హైద‌రాబాద్ తిరిగి వ‌స్తున్నారు.. ఆ కార‌ణంగా త‌ను న‌టిస్తున్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు ఈ మూవీ తాజా షెడ్యూల్ ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లు పెట్టారు.

ప‌వ‌న్ త‌రువాత మ‌హేష్ బాబు కూడా త్వ‌ర‌లో త‌న 28వ ప్రాజెక్ట్ తాజా షెడ్యూల్ ని మొద‌లు పెట్ట‌బోతున్నాడు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ పుట్టిన రోజైన న‌వంబ‌ర్ 7న దీనికి సంబంధించిన అప్ డేట్ ని ఇవ్వ‌బోతున్నాడ‌ని చెబుతున్నారు. ఇటీవ‌లే లండ‌న్ వెళ్లిన మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి హైద‌రాబాద్ తిరిగొచ్చాడు.

ఫ‌స్ట్ షెబ్యూల్ పూర్తయింది. మ‌హేష్ మ‌ద‌ర్ ఇందిరా దేవి చ‌నిపోవ‌డంతో త‌దుప‌రి షెడ్యూల్‌కి బ్రేక్ ప‌డింది. ఈ నెల‌లో త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇక 'పుష్ప‌' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ దీనికి కొన‌సాగింపుగా 'పుష్ప 2'ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ని మొద‌లు పెట్టాల‌ని, సెట్ లో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్, పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్‌ లు సెట్ లో సంద‌డి చేస్తుంటే టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా బ‌రిలో దిగ‌డానికి రెడీ అవుతుండ‌టం తో టాలీవుడ్ లో షూటింగ్ ల సంద‌డి మొద‌లు కాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.