Begin typing your search above and press return to search.

'ఆచార్య' కోసం ధర్మస్థలిలో అడుగుపెట్టిన చరణ్..!

By:  Tupaki Desk   |   10 July 2021 1:31 PM GMT
ఆచార్య కోసం ధర్మస్థలిలో అడుగుపెట్టిన చరణ్..!
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. రామ్ చరణ్ పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ.. 'ధర్మస్థలి తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి' అని పేర్కొన్నారు.

'ఆచార్య' కొత్త పోస్టర్ లో రామ్ చరణ్ కోర మీసాలతో, మెడలో రుద్రాక్ష.. నుదిటిన బొట్టుతో నడుచుకుంటూ వస్తూ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కామ్రేడ్ సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే చిరు కూడా ధర్మస్థలి సెట్స్ లో అడుగుపెడతారని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

ఇకపోతే చరణ్ మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా మెగా హీరో కనిపించనున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసిన చెర్రీ.. రెండు పాటల చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ఎన్టీఆర్ - చరణ్ కాంబోలో వచ్చే సాంగ్ ఒకటైతే.. చరణ్ - అలియా భట్ లపై తీయాల్సిన పాట మరొకటి. 'ఆచార్య' మరియు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. ఆగస్టు నెలాఖరుకు ఫ్రీ అయిపోవాలని చరణ్ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే శంకర్ దర్శకత్వంలో #RC15 చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని చూస్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో చెర్రీ రెస్ట్ లేకుండా య్ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా వర్క్ చేయనున్నా