Begin typing your search above and press return to search.

బాలయ్య - జయమ్మ మధ్య అలాంటి అనుబంధం ఏర్పడిందా..?

By:  Tupaki Desk   |   20 Oct 2022 11:30 PM GMT
బాలయ్య - జయమ్మ మధ్య అలాంటి అనుబంధం ఏర్పడిందా..?
X
నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ఆహా' ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ షో.. దెబ్బకు బాలయ్య మీద అందరి థికింగ్ ని పూర్తిగా మార్చేసింది.

బాలకృష్ణ అంటే కోపదారి మనిషి - ఆవేశపరుడు.. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదనే అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి. పబ్లిక్ గా కోపగించుకోవడాలు.. అభిమానులను చెంప దెబ్బలు కొట్టడాలు వంటివి ఆయనపై అలాంటి ఒపీనియన్ ఏర్పడటానికి కారణమయ్యాయి.

ఈ నేపథ్యంలో 'అన్ స్టాపబుల్' షో బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. కోపం, బాధ, ప్రేమ, ఆనందం.. ఏదైనా వెంటనే చూపిస్తారని.. భావోద్వేగాలను అస్సలు దాచుకోలేరని అందరికీ అర్థమైంది.

నటసింహాన్ని అర్థం చేసుకున్న వారు.. మంచి బాండింగ్ ఏర్పరచుకున్న వాళ్ళు బాలయ్యను వదులుకోలేరని తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఆయనతో అనుబంధాన్ని ఆస్వాదిస్తోందని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న #NBK107 చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో సిస్టర్ సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ఇందులో బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మి నటిస్తోంది.

తొలిసారిగా బాలయ్యతో కలిసి నటిస్తున్న వరు.. సీనియర్ హీరో కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తోందట. ఆన్ స్క్రీన్ లో పాత్రకు తగ్గట్టు 'అన్నా' అని పిలిచినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఒక కూతురుగా బాలకృష్ణ తో మేలుగుతోందట. బాలయ్య కూడా ఆమెని ఒక కూతురిలా ట్రీట్ చేస్తున్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.

సెట్ లో ఇద్దరూ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ.. కలిసి భోజనం చేస్తూ సరదా సరదాగా గడుపుతున్నారట. NBK107 షూటింగ్ లో బాలకృష్ణ - వరలక్ష్మి మధ్య ఏర్పడిన అనుబంధం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఓవైపు నెగిటివ్ రోల్స్ మరోవైపు పాజిటివ్ రోల్స్ చేస్తూ తెలుగు తమిళ ఆడియన్స్ ని అలరిస్తోంది. 'క్రాక్' చిత్రంలో జయమ్మగా అద్భుతమైన నటన కనబరిచింది. ఆమె కెరీర్ లోనే గుర్తుండి పోయే రోల్ ఇచ్చిన గోపీచంద్ మలినేని.. ఇప్పుడు బాలయ్య సినిమాలోనూ కీలక పాత్ర ఇచ్చారని తెలుస్తోంది.

వీరిద్దరూ కలిసి తమ అసాధారణ నటనతో ప్రశంసలు అందుకోబోతున్నారని ఇన్సైడ్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఇకపోతే వరలక్ష్మి NBK107 తో పాటుగా 'యశోద' 'హనుమాన్' 'శబరి' 'మైఖేల్' వంటి మల్టీ లాంగ్వేజ్ చిత్రాలలో నటిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.