Begin typing your search above and press return to search.

మీరాచోప్రా వివాదం: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నోటీసులు!

By:  Tupaki Desk   |   7 Jun 2020 10:22 AM GMT
మీరాచోప్రా వివాదం: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నోటీసులు!
X
తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్న నెటిజన్లపై హీరోయిన్ మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు.. సీఎం వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మీరాచోప్రాపై కొంతమంది తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది.

తనకు ఎన్టీఆర్ గురించి తెలియదని.. తాను ఎన్టీఆర్ అభిమానిని కాదని.. మహేష్ బాబు అంటే తనకు ఎక్కువ ఇష్టమని చెప్పినందుకు మీరా చోప్రాను కొంతమంది నెటిజన్లు అసభ్య పదజాలంతో తిడుతూ ట్విట్టర్ వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మీరాచోప్రా ఈ విషయాన్ని సైబర్‌ క్రైమ్‌ కి నివేదించడంతోపాటు ఈ సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి రెండు రోజుల క్రితం తీసుకువచ్చింది. దీంతో తెలంగాణ పోలీస్ అధికారులు స్పందించి 20 మంది ఎన్టీఆర్ అభిమానులకు లీగల్ నోటీసులు పంపినట్లు కనిపిస్తోంది.

ఈ యువకులను రాబోయే రోజుల్లో అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. తమ అభిమాన హీరోపై ప్రేమతో హీరోయిన్ పై కామెంట్స్ చేసిన ఫ్యాన్స్ అరెస్ట్ కు దారితీయడం విశేషం. ఇక నుంచి సోషల్ మీడియాలో కామెంట్స్ విషయంలో ఫ్యాన్స్ అందరికీ ఈ ఇష్యూ ఒక పాఠంగా మారనుంది.