Begin typing your search above and press return to search.

వైరల్ పోస్ట్: తారక్ - చరణ్ లకు హెల్మెట్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు..!

By:  Tupaki Desk   |   29 Jun 2021 3:12 PM GMT
వైరల్ పోస్ట్: తారక్ - చరణ్ లకు హెల్మెట్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు..!
X
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజాహితార్థం సోషల్ మీడియాలో విన్నూతమైన పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అనేక పద్ధతుల్లో అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. సినిమా పోస్టర్స్ - ఫన్నీ మీమ్స్ ద్వారా కూడా ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తే హెల్మెట్ తప్పకుండా ధరించాలని.. ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదని చెబుతూ.. వీటి వల్ల జరిగే ప్రమాదాలను మీమ్స్ రూపంలో వివరిస్తున్నారు. తాజాగా 'ఆర్.ఆర్.ఆర్' పోస్టర్ ద్వారా అవగాహన కల్పించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సంకల్పించారు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రం నుంచి మంగళవారం ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో కొమురం భీమ్ పాత్రధారి తారక్ - అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్ ఇద్దరూ ఓ బైక్ పై వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టర్ లో RRR హీరోలకు హెల్మెట్ జత చేస్తూ సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు మీమ్ రెడీ చేశారు.

''ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. హెల్మెట్‌ ధరించడండి.. సురక్షితంగా ఉండండి'' అంటూ ట్వీట్ చేసిన సైబరాబాద్‌ పోలీసులు.. తమ సోషల్‌ మీడియా అకౌంట్ లో ఈ ఫోటోని షేర్ చేశారు. దీనికి రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - డీవీవీ దానయ్య లను ట్యాగ్ చేశారు. దీంతో RRR టీమ్ కూడా దీనికి స్పందించింది. ''ఇప్పటికీ పర్ఫెక్ట్‌ గా లేదు. నంబర్‌ ప్లేట్‌ మిస్సింగ్'' అని ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చింది. చరణ్ - తారక్ హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. భద్రతపై వినూత్న రీతిలో ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులను అందరూ ప్రశంసిస్తున్నారు.