Begin typing your search above and press return to search.

టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ గా టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్‌!

By:  Tupaki Desk   |   16 Dec 2022 1:30 PM GMT
టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ గా టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్‌!
X
ఏపీలో అధికారంలో వున్న వైఎస్సార్సీపీ పార్టీకి అనుకూలంగా వున్న వారికి వివిధ శాఖ‌ల్లో ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌నిస్తున్న విష‌యం తెలిసిందే. ఇండ‌స్ట్రీ కి చెందిన వ్య‌క్తులకు ఈ విష‌యంలో పెద్ద పీట వేస్తున్నారు. రీసెంట్ గా పోసాని కృష్ణ మురళీ - హాస్యనటుడు అలీలకు ప్ర‌త్యేక ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన వైఎస్సార్పీపీ ప్ర‌భుత్వం అదే పంథా లో టీవీ యాంక‌ర్ వ‌ర్ధ‌మాన గాయ‌నీ మంగ్లీ ని తిరుమ‌ల తిరుప‌తి దేశ స్థానంకు చెందిన శ్రీ‌వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ కు స‌ల‌హాదారుగా 2022 న‌వంబ‌ర్ ని నిమియించ‌డం తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ కు చెందిన నిర్మాత దాస‌రి కిర‌ణ్ కుమార్ తిరుమ‌ల తిరుప‌తి దేశ స్థాన బోర్డ్ మెంబ‌ర్ గా నియమించడం గ‌మ‌నార్హం. నిర్మాత దాస‌రి కిర‌ణ్‌ కుమార్ గ‌తంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ - అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు వంటి చిత్రాల‌ను నిర్మించాడు.

ఈ రెండు సినిమాల‌లో స్వ‌ర్గీయ‌ నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌లోని కీల‌క ఘ‌ట్టం నేప‌థ్యంలో సెటైరిక‌ల్ గా తెర‌కెక్కిన 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌' ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ సినిమా టీడీపీకి, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు గ‌త ఎన్నిక‌ల్లో భారీ షాకిచ్చింది. ఈ నేప‌త్యంలో మ‌రోసారి టీడీపీని ఇరుకున పెట్టాల‌నే ల‌క్ష్యంతో 2024 ఎన్నిక‌ల‌ని టార్గెట్ చేస్తూ ఓ సంచ‌ల‌న పొలిటిక‌ల్ డ్రామాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌ట‌.

దీని కి దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్వాత‌గా వ్య‌వ‌హ‌రంచ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో నిర్మాత దాస‌రి కిర‌ణ్ కుమార్ ని తిరుమ‌ల తిరుప‌తి దేశ స్థానం బోర్డు స‌భ్యుడిగా నియ‌మించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అంతే కాదు దాసరి కిరణ్ వైస్సార్ అభిమాని అలానే వైస్సార్సీపీ పార్టీ పెట్టినప్పుడు నుంచి పార్టీ కోసం జగన్ కోసం పని చేసారు. సినిమా ప్రొడ్యూసర్ కన్నా వైస్సార్సీపీ పార్టీ అభిమాని గా నాయకుడు గానే ఆయన గురించి చెబుతారు.

దాసరి కిర‌ణ్ కుమార్ ను టీటీడీ బోర్డ్ స‌భ్యుడిగా నియ‌మిస్తూ శుక్ర‌వారం వైసీపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం విశేషం. త్వ‌ర‌లో రామ‌క్ష గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో దాస‌రి కిర‌న్ కుమార్ స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో 'ప్యూహం' అనే మూవీని చేయ‌బోతున్నారు. 2024 ఎన్నిక‌ల స‌మ‌రానికి ముందే ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని, ఈ మూవీతో టీడీపీని టార్గెట్ చేయాల‌ని వ‌ర్మ ప్లాన్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.