Begin typing your search above and press return to search.

తారక్ తన సినిమా పేరునే ఫార్మ్ హౌస్ కు పెట్టుకున్నాడా..?

By:  Tupaki Desk   |   16 July 2022 10:36 AM GMT
తారక్ తన సినిమా పేరునే ఫార్మ్ హౌస్ కు పెట్టుకున్నాడా..?
X
టాలీవుడ్ లో చాలామంది టాప్ హీరోలు మరియు దర్శక నిర్మాతలు హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ హౌస్ లు ఉన్నాయి. సిటీలోని ఇళ్లకే పరిమితం కాకుండా వీకెండ్ లో అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయం గడపడానికి.. పార్టీలు చేసుకోడాన్ని ఇష్టపడుతుంటారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ సొంతంగా పండ్లు, కూరగాయలు పండించేవారున్నారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఫామ్ హౌస్ ఉందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

ఎన్టీఆర్ గతంలో నగర శివార్లలోని శంకర్ పల్లి మండలం గోపులాపురం గ్రామంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రదేశంలో అగ్ర హీరో ఒక విశాలమైన ఫామ్ హౌస్ ను అభివృద్ధి చేశారు. ఇది అందమైన తోటలతో సుమారు 6.5 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీన్ని తన సతీమణి లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు కానుకగా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే నిర్వహించినట్లు చెప్పుకున్నారు.

అయితే తారక్ ఈ ఫామ్ హౌస్ కి 'బృందావనం' అని పేరు పెట్టినట్లు వినికిడి. ఇదే టైటిల్ తో ఎన్టీఆర్ గతంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. తనకు కలిసొచ్చిన బృందావనం పేరునే ఇప్పుడు ఫార్మ్ హౌస్ కి పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'అరవింద సమేత వీర రాఘవ' సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని RRR చిత్రంతో వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి తారక్ చేసిన ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా కొమురం భీమ్ గా ఆయన నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో వచ్చిన క్రేజ్ తో తారక్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా చిత్రాలను లైన్ లో పెడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని చేయనున్నాడు. 'జనతా గ్యారేజ్' వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

అలానే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ భారీ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే NTR31 కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 'కేజీఎఫ్ 2' తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నీల్.. ఈసారి తారక్ తో కలిసి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ యాక్షన్ కు ప్రశాంత్ ఎలివేషన్ మరియు ఎమోషన్స్ జత కడితే నెక్స్ట్ లెవల్ ఉంటుందని ధీమాగా ఉన్నారు.