Begin typing your search above and press return to search.
దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్: ఇద్దరి లోకం ఒకటే
By: Tupaki Desk | 22 April 2019 10:08 AM GMTయువ హీరో రాజ్ తరుణ్ ఈమధ్య తన కెరీర్లో స్లో అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన 'లవర్' పై నమ్మకం పెట్టుకున్నా ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. పోయినేడాది రిలీజ్ అయిన 'లవర్' తర్వాత కొద్ది నెలలు గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చాడు. రాజుగారి బ్యానర్ లోనే రాజ్ తరుణ్ కొత్త సినిమా ఈరోజే లాంచ్ అయింది.
'ఇద్దరి లోకం ఒకటే' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి GR కృష్ణ దర్శకుడు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి సీనియర్ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ అతిథిగా హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.
ఈ సినిమా లాంచ్ సందర్భం గా టైటిల్ లోగో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పింక్ కలర్ పెయింటింగ్ నేపథ్యంలో ఉండగా 'ఇద్దరి లోకం ఒకటే' అనే బ్లాక్ ఫాంట్ తో టైటిల్ ఉంది. 'లోకం' పదానికి చుట్టూ వైట్ కలర్ హార్ట్ సింబల్ ఉంది. ఇక ఈ సినిమా క్యాప్షన్ 'యూ ఆర్ మై హార్ట్ బీట్'.
'ఇద్దరి లోకం ఒకటే' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి GR కృష్ణ దర్శకుడు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి సీనియర్ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ అతిథిగా హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.
ఈ సినిమా లాంచ్ సందర్భం గా టైటిల్ లోగో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పింక్ కలర్ పెయింటింగ్ నేపథ్యంలో ఉండగా 'ఇద్దరి లోకం ఒకటే' అనే బ్లాక్ ఫాంట్ తో టైటిల్ ఉంది. 'లోకం' పదానికి చుట్టూ వైట్ కలర్ హార్ట్ సింబల్ ఉంది. ఇక ఈ సినిమా క్యాప్షన్ 'యూ ఆర్ మై హార్ట్ బీట్'.