Begin typing your search above and press return to search.

మళ్లీ రాజు గారు వండటం స్టార్ట్ చేశారు

By:  Tupaki Desk   |   28 Aug 2016 11:00 AM IST
మళ్లీ రాజు గారు వండటం స్టార్ట్ చేశారు
X
నిర్మాత దిల్ రాజు.. ఆయన క్యాంపులో ఏ సినిమా వచ్చినా కూడా.. దాదాపు కథంతా ఆయన రకరకాల మార్పులు చేర్పులు చేసేసి.. ఆయన వండించి.. దగ్గరుండి తీయిస్తారు.. అని ఒక టాక్ ఉంది. టాక్ ఏంటి.. అది నిజమే అంటారు ఆయనతో పనిచేసిన దర్శకులు. అయితే ఈ మధ్యన అలా ఆయన వండించిన కథలన్నీ అద్భుతమైన ఫ్లాపుల్లా మిగిలిపోతున్నాయి.

ఈ మధ్యన జోష్‌ సినిమా దర్శకుడు వాసు వర్మ.. కృష్ణాష్టమి అంటూ ఒక సినిమాతో వచ్చాడు. ఈ కథలన్నీ దిల్ రాజు దగ్గరుండి వండించినవే. కాని అవేవి ధియేటర్ల దగ్గర వర్కవ్వలేదు. అయితే శేఖర్ కమ్ముల వంటి దర్శకులు తీసే సినిమాల్లో కథల్లో వేలుపట్టని రాజు గారు.. ఇప్పుడు ఆయన క్యాంపస్ లో ఆయన క్యాంపు రైటర్ సతీష్‌ వేగేశ్న తీస్తున్న ''శతమానం భవతి'' సినిమా కథపై మాత్రం బాగానే చెయ్యేశారట. ''ఈ సినిమా కల్పితం కాదు, ఓ జీవితం. ‘దిల్’రాజుగారు చెప్పిన కరెక్షన్స్ వలన స్క్రిప్ట్ బాగా వచ్చింది'' అంటూ దర్శకుడు-రైటర్ సతీష్‌ వేగేశ్న నిన్న సినిమా ముహూర్తం కొట్టిన సందర్భంగా చెప్పాడులే.