Begin typing your search above and press return to search.

పాన్ ఇండియాకు కేరాఫ్‌ ఆమె.. వంశీ కూడా ఆమె వైపే చూపు

By:  Tupaki Desk   |   1 Oct 2021 3:30 AM GMT
పాన్ ఇండియాకు కేరాఫ్‌ ఆమె.. వంశీ కూడా ఆమె వైపే చూపు
X
సౌత్ లో ఈమద్య కాలంలో స్టార్‌ హీరోలు ముఖ్యంగా తెలుగు హీరోలు చేస్తున్న ఎక్కువ శాతం సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్నాయి. ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్నాయి. ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. కనుక ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం. అందుకే వారి తదుపరి సినిమాలను పాన్ ఇండియా మూవీస్ గా రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌ తో శంకర్ మూవీ పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు. వీరి కాంబో మూవీ లో హీరోయిన్‌ గా కియారా అద్వానీని ఎంపిక చేయడం జరిగింది. తెలుగు లో ఇప్పటికే భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియారా అద్వానీ బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. ఇక్కడ అక్కడ గుర్తింపు ఉన్నది కనుకే శంకర్‌ తన సినిమాలో చరణ్‌ కు జోడీగా ఆమెను ఎంపిక చేయడం జరిగింది.

చరణ్‌ సినిమాలోనే కాకుండా ఎన్టీఆర్‌.. కొరటాల శివ కాంబోలో రూపొందబోతున్న సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా మూవీ అనగానే ఎక్కువ శాతం ఈమద్య కాలంలో కియారా అద్వానీ పేరు వినిపిస్తుంది. అంతట గుర్తింపు ఉన్న హీరోయిన్స్ నటించడం వల్ల అన్ని చోట్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అవుతుంది. అందుకే ఈ కియారా అద్వానీకి మంచి డిమాండ్‌ ఉంది. తాజాగా మరో సినిమాలో కిరాయా అద్వానీ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సౌత్‌ లో రూపొందబోతున్న పాన్ ఇండియా మూవీకి గాను ఆమెను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. అదే విజయ్ తో వంశీ పైడి పల్లి తీయబోతున్న సినిమా. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు లో రూపొందబోతున్న ఈ సినిమాకు గాను కియారా అద్వానీని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. విజయ్ వంటి స్టార్‌ తో నటించేందుకు కియారా అద్వానీ ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో శంకర్‌.. చరణ్ ల మూవీని కియారా అద్వానీ చేస్తోంది. ఆ సినిమా తో పాటు విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా నటించాల్సిందిగా దిల్ రాజు కోరాడని.. అందుకే ఆమె ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. ఒక నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ నటించడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. డేట్ల విషయంలో ఇబ్బంది తలెత్తక పోవడమే కాకుండా పారితోషికం ఇంకా ఇతర విషయాల్లో కూడా అంశాలు కలిసి వస్తాయి. దానికి తోడు కియారా అద్వానీ సినిమాలో ఉంటే పాన్ ఇండియా అప్పీల్‌ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. విజయ్ కు జోడీగా కియారా అద్వానీ చక్కగా సూట్‌ అవుతుంది అనే ఉద్దేశ్యంతో వంశీ పైడిపల్లి ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి మరెన్ని పాన్ ఇండియా సినిమాల్లో ఈ అమ్మడు నటించబోతుందో చూడాలి. ఒకే సారి చరణ్.. ఎన్టీఆర్‌.. విజయ్‌ వంటి సౌత్ స్టార్స్ తో పాటు హిందీ సినిమాల్లో కూడా ఈమె నటిస్తూ బిజీ బిజీగా ముందుకు సాగుతోంది.